Brahma Kumaris Chief Dadi Ratan Mohini passed away

Dadi Ratan Mohini : బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్ మోహిని క‌న్నుమూత‌

Dadi Ratan Mohini : శ‌తాధిక వృద్ధ మ‌హిళ‌, ఆధ్యాత్మిక నేత, బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ అడ్మినిస్ట్రేట‌ర్ దాది ర‌త‌న్‌ మోహిని క‌న్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్ర‌హ్మ‌కుమారిగా ర‌త‌న్ మోహిని రికార్డు నెల‌కొల్పారు. అంత‌కుముందు దాది జాన‌కి.. బ్ర‌హ్మ‌కుమారి సంస్థ చీఫ్‌గా చేశారు. దాది జాన‌కి 1916, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన జ‌న్మించి, 2020, మార్చి 27వ తేదీన మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజుల నుంచి దాది ర‌త‌న్ మోహిన్ ఆరోగ్యం స‌రిగా లేదు. ఆదివారం సాయంత్రం ఆమె ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది.

Advertisements
బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్

శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాం తరలింపు

దీంతో రాజ‌స్థాన్‌లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివ‌నంలోని ట్రామా సెంట‌ర్‌కు డ‌యాల‌సిస్ కోసం ఆమెను త‌ర‌లించారు. సోమ‌వారం ఆమె ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌కంగా మారింది. దీంతో క్రిటిక‌ల్ కండీష‌న్‌లో ఉన్న ఆమెను అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 1.20 నిమిషాల‌కు ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్ర‌హ్మ‌కుమారి ప్ర‌ధాన కార్యాల‌యంలో శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాన్ని తీసుకెళ్ల‌నున్నారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో సేవా కార్య‌క్ర‌మాలు

సింధ్‌లోని హైద‌రాబాద్‌లో 1925, మార్చి 25వ తేదీన దాది ర‌త‌న్ మోహిని జ‌న్మించారు. ఆమె ఒరిజిన‌ల్ పేరు ల‌క్ష్మీ. చాలా ఉన్న‌త‌మైన కుటుంబంలో ఆమె జ‌న్మించారు. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్ర‌హ్మ‌కుమారి ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫ‌రెన్స్‌లో బ్ర‌హ్మ‌కుమారీల త‌ర‌పున ఆమె పాల్గొన్నారు. హాంగ్‌కాంగ్‌, సింగ‌పూర్, మ‌లేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె ప‌ర్య‌టించారు.

Read Also: చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

Related Posts
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి
Terrorist attack on army vehicle

ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన ఆర్మీ అధికారులు శ్రీనగర్‌: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం Read more

ఢిల్లీలో 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
Delhi's AQI crosses the 421 mark

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్క్‌ను దాటేసింది. దీనితో Read more

మర్రి జనార్దన్ రెడ్డికి పితృవియోగం
Marri Janardhan Reddy lost his father

హైరదాబాద్‌: నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి మర్రి జంగిరెడ్డి (80) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా Read more

25 భాషలను మింగేసిన హిందీ:స్టాలిన్
25 భాషలను మింగేసిన హిందీ:స్టాలిన్

త్రిభాషా విధానం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించగా, తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×