Brahma Kumaris Chief Dadi Ratan Mohini passed away

Dadi Ratan Mohini : బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్ మోహిని క‌న్నుమూత‌

Dadi Ratan Mohini : శ‌తాధిక వృద్ధ మ‌హిళ‌, ఆధ్యాత్మిక నేత, బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ అడ్మినిస్ట్రేట‌ర్ దాది ర‌త‌న్‌ మోహిని క‌న్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్ర‌హ్మ‌కుమారిగా ర‌త‌న్ మోహిని రికార్డు నెల‌కొల్పారు. అంత‌కుముందు దాది జాన‌కి.. బ్ర‌హ్మ‌కుమారి సంస్థ చీఫ్‌గా చేశారు. దాది జాన‌కి 1916, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన జ‌న్మించి, 2020, మార్చి 27వ తేదీన మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజుల నుంచి దాది ర‌త‌న్ మోహిన్ ఆరోగ్యం స‌రిగా లేదు. ఆదివారం సాయంత్రం ఆమె ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది.

Advertisements
బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్

శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాం తరలింపు

దీంతో రాజ‌స్థాన్‌లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివ‌నంలోని ట్రామా సెంట‌ర్‌కు డ‌యాల‌సిస్ కోసం ఆమెను త‌ర‌లించారు. సోమ‌వారం ఆమె ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌కంగా మారింది. దీంతో క్రిటిక‌ల్ కండీష‌న్‌లో ఉన్న ఆమెను అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 1.20 నిమిషాల‌కు ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్ర‌హ్మ‌కుమారి ప్ర‌ధాన కార్యాల‌యంలో శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాన్ని తీసుకెళ్ల‌నున్నారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో సేవా కార్య‌క్ర‌మాలు

సింధ్‌లోని హైద‌రాబాద్‌లో 1925, మార్చి 25వ తేదీన దాది ర‌త‌న్ మోహిని జ‌న్మించారు. ఆమె ఒరిజిన‌ల్ పేరు ల‌క్ష్మీ. చాలా ఉన్న‌త‌మైన కుటుంబంలో ఆమె జ‌న్మించారు. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్ర‌హ్మ‌కుమారి ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫ‌రెన్స్‌లో బ్ర‌హ్మ‌కుమారీల త‌ర‌పున ఆమె పాల్గొన్నారు. హాంగ్‌కాంగ్‌, సింగ‌పూర్, మ‌లేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె ప‌ర్య‌టించారు.

Read Also: చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

Related Posts
Araku Coffee : అరకు కాఫీ గురించి గతంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ
Araku Coffee అరకు కాఫీ గురించి గతంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ

Araku Coffee : అరకు కాఫీ గురించి గతంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ అరకు కాఫీ ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం Read more

వసంత పంచమి.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
vasantha panchami in 2025

వసంత పంచమి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ బాసర సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్న భక్తులు, Read more

కర్నూలులో హైకోర్టు బెంచ్: ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు
కర్నూలులో హైకోర్టు బెంచ్: ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వం 'ప్రజాగలం' కార్యక్రమంలో ఇచ్చిన హామీల ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు గణనీయమైన చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర మంత్రివర్గం Read more

ట్రంప్ విజయం అనంతరం నెతన్యాహూ అభినందనలు
netanyahu

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం ప్రకటించిన వెంటనే, ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహూ ఆయనకు అభినందనలు తెలిపారు. ట్రంప్ విజయాన్ని స్వీకరించిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×