📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు సుప్రీంకోర్టు ఊహించని షాక్

Author Icon By Anusha
Updated: April 26, 2025 • 5:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ వైసీపీ సానుభూతిపరుడు, ఆ పార్టీ అధికారంలో ఉండగా కూటమి పార్టీల నేతలపై తీవ్ర స్ధాయిలో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. గతంలో తన తల్లికి అనారోగ్యం పేరుతో బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అనిల్ కుమార్ దాని పొడిగింపు కోసం కోర్టుకు సమర్పించిన సర్ఠిఫికెట్ అంటూ పోలీసులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన పెట్టుకున్న కొత్త బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఎటూ తేల్చడం లేదు. దీనిపై బోరుగడ్డ సుప్రీంను ఆశ్రయించారు.తన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా ఏపీ హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అయితే ఈ వ్యవహారంలో హైకోర్టుకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు బోరుగడ్డకు తేల్చిచెప్పేసింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ పెట్టి బెయిల్ పొడిగించుకున్న వ్యవహారం తేలే వరకూ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో బోరుగడ్డకు షాక్ తప్పలేదు.

బెయిల్ పిటిషన్

బోరుగడ్డ అనిల్ సమర్పించిన నకిలీ ధృవపత్రాల ఆధారంగా బెయిల్ ఇచ్చారా లేదా అన్న విషయం తేలకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపితే ఆ ప్రభావం దీని మీద పడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథన్ తెలిపారు. అందుకే ఆ ధృవపత్రాలపై హైకోర్టు నివేదిక కోరినట్లు వెల్లడించారు. అయితే చివరిగా బోరుగడ్డ బెయిల్ పిటిషన్ పై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నిర్ణయం ప్రకటించాలని మాత్రం మరో జడ్జి జస్టిస్ నాగరత్న ఏపీ హైకోర్టును ఆదేశించారు. దీంతో త్వరలో బోరుగడ్డ బెయిల్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సానుకూల

బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితిపై రాజకీయ పరిశీలకులు విశ్లేషణ చేస్తూ, ఇది వైసీపీకి ఒక పెద్ద నష్టమేనని చెబుతున్నారు. ఒకప్పుడు పార్టీకి గట్టి మద్దతుగా నిలిచిన అనిల్ కుమార్ ఇలాంటి సమస్యల్లో చిక్కుకోవడం, ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం అనిల్ కుమార్ పరిస్థితి ఎంతో క్లిష్టంగా మారింది. ఒకవైపు కోర్టు నుండి తక్షణ సానుకూల నిర్ణయం రాకపోవడం, మరోవైపు పోలీసుల గట్టి ఆధారాలతో ఎదురుదాడి కొనసాగడం ఆయనను మరింత కష్టాల్లోకి నెట్టింది.ఇంతవరకు బోరుగడ్డ అనిల్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తనను రాజకీయంగా నిందించేందుకు ఈ కుట్ర జరుగుతోందని అంటున్నాడు.

Read Also: Andhra University: శతాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతున్న ఆంధ్ర యూనివర్సిటీ

#AndhraPradesh #APPolitics #BorugaddaAnilKumar #highcourt #ycp Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.