📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Andhra Pradesh:ఫేస్‌బుక్ ద్వారా ఆస్తుల వివరాలను వెల్లడించిన మాజీ ఎంపీ

Author Icon By Anusha
Updated: May 3, 2025 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపి రాజకీయాల్లో ఎంతోమంది నేతలు కొనసాగుతున్నారు.కొందరు నేతలు వారి ఆస్తుల వివరాలను ఓపెన్‌గా చెబుతుంటారు. కొందరు మాత్రం ఆ వివరాలను కాస్త రహస్యంగానే ఉంచుతారు. ఈ మాజీ ఎంపీ మాత్రం అలా కాదు సోషల్ మీడియా వేదికగా తన ఆస్తుల చిట్టా మొత్తాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. తనకు ఉన్న ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఖరీదైన కార్లు, బైక్‌తో సహా వివరాలను బయటకు చెప్పేశారు.అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఫేస్‌బుక్ వేదికగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.’ఇవి నాకున్న కార్లు, ఒక బుల్లెట్. ఇంకోటి స్కార్పియో ప్రచార రధం, వోల్క్ష్వాగేం జిట్టాకూడా ఉన్నాయి. వోల్వో వర్షంలో మునిగి పోయి చెడి పోయింది. అది అమ్మేసాను.బివైడి ఎందుకు కొన్నానంటే ప్రతి నెల లక్ష రూపాయలు రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం బంక్ కు కడతాను. ఇది ఎలక్ట్రికల్ కార్ హైద్రాబాద్ వెళ్లాలంటే 500 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 km వెళ్ళవచ్చు. పనికిమాలిన ఊహా గానాలు మానేయండి.ప్రతి కారు ఫైనాన్స్ లొనే కొన్నుకుంటాము. ప్రతి కారుకు లెక్క పత్రాలు ఉంటాయి. ఇకపోతే రాజమండ్రిలో 1000 గజాలలో 10 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది . వైజాగ్ లో ఆక్సిజన్ టవర్స్‌లో 35 ఫ్లోర్‌లో 3 కోట్ల విలువ చేసే ప్లాట్ ఉంది. అమలాపురంలో ఒక ఇల్లు కొంటున్నాను ట్రాన్సక్షన్ పూర్తి అవ్వలేదు’ అన్నారు.

ఫార్మ్ హౌస్

ముమ్మిడివరం లో రెండున్నర ఎకరాల మామిడి తోట ఉంది. ఒక అర ఎకరం 4th బ్రిడ్జి హైవే మీద ఉంది. దానిలో ఫుడ్ కోర్ట్ , ఫంక్షన్ హాల్ , స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 3 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది. అది కాలేజ్ పేరు మీద ఉంటుంది.. ఒక కాలేజీ ఉంది. డిగ్రీ పీజీ, ప్రొఫెషనల్ కోర్సెస్ , ఫాషన్ టెక్నాలజీ ఫార్మసీ కాలేజీ ఉన్నాయి. ఆన్లైన్ ఎక్సమినేషన్ ఉంది. దీనిలో ఒక్క ఇల్లు తప్ప ఇంక ఏది నా పేరు మీద ఉండదు అన్ని కొడుకుల పేర్ల మీదే ఉంటాయి. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నావి అని చెప్పుతున్నాను. ఈడీ, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ , స్టేట్ ఏసీబీఅన్ని మీవే కదా పంపించండి. ఏ, ఏ ఆస్తులు ఎలా కొన్నానో ఏ ఏ కార్లు ఎలా కొన్నానో తెలుస్తుంది’ అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టి మరీ ఆస్తుల వివరాలను ఓపెన్‌గా అందరి ముందు చెప్పారు.

వివరాలను

ఇంతకీ మాజీ ఎంపీ హర్షకుమార్ తన ఆస్తుల వివరాలు ఎందుకు ఓపెన్‌గా చెప్పారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన ఇటీవల తన కుమారుడితో కలిసి ఓ కొత్త కారు ముందు నిలబడి ఫోటో తీసుకున్నారు. కొందరు ఈ ఫోటోను ప్రస్తావిస్తూ ప్రవీణ్ పగడాల కేసుకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.ఆస్తుల వివరాలను వెల్లడించారు.

Read Also: Andhra Pradesh: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు

#Amalapuram #AssetDeclaration #FormerMP #GVHarshaKumar #PoliticalTransparency #PropertyDetails #SocialMediaDisclosure #TransparentLeadership Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.