ఏపీ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. ఇటీవల ఉద్యోగులకు పెండింగ్ ఉన్న బకాయిల్ని చెల్లించగా ఆ తర్వాత ఆయా శాఖల్లో అధికారులు, ఉద్యోగుల ప్రమోషన్లు, కారుణ్య నియామకాలను చేపట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో ఇటీవల ప్రమోషన్లు చేపట్టారు. తాజాగా ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులకు పదోన్నతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆర్టీసీ (పీడీటీ)లో ఉద్యోగుల మెరిట్ రేటింగ్ రిపోర్టులను (ఎంఆర్ఆర్స్) పరిగణలోకి తీసుకుని ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లో ఏసీఆర్స్ (వార్షిక రహస్య నివేదికలు)ను పరిగణలోకి తీసుకుంటారు. ఆర్టీసీలో మాత్రం ఎంఆర్ఆర్స్ (మెరిట్ రేటింగ్ రిపోర్టులు)ను పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిర్ణయంతో దాదాపు 110 మంది అధికారులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది అంటున్నారు.

కమిటీ
ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజినల్ మేనేజర్, సీనియర్ స్కేల్ అధికారి, చీఫ్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ ఎకౌంట్స్ అధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వంటి పోస్టులకు పదోన్నతులు ఇవ్వడానికి ఒక కమిటీ సమావేశమైంది. ఆ సమయంలో ఆర్టీసీ అధికారులు, పదోన్నతులకు అర్హులైన ఉద్యోగుల ఎంఆర్ఆర్ఎస్ను అందజేశారు. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. దీంతో వారికి ఏసీఆర్ఎస్ ఉండాలని, అప్పుడే పదోన్నతులు ఇవ్వగలమని కమిటీ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో ఆయా అధికారులకు చెందిన ఏసీఆర్స్ ఉండాలని డీపీసీ పేర్కొని, పదోన్నతులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఉద్యోగులకు పదోన్నతులు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. ఈసారి ఎంఆర్ఆర్ఎస్ను పరిగణనలోకి తీసుకుని ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ఊరట లభించింది.ఏపీ ఫైబర్నెట్కు రూ.112.50 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (ఎస్ఏఎస్సీఐ) కింద 2025-26లో వినియోగించుకునేందుకు అనుమతించాలని సంస్థ ఎండీ ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక వసతులు, నిలిచిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించేందుకు వీలుగా నిధులు అవసరమని పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీ లో కొత్త సూపర్ ఫాస్ట్- హాల్ట్ స్టేషన్లు ఇవే