हिन्दी | Epaper

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం:అచ్చెన్నాయుడు

Sharanya
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం:అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంక్షేమం ప్రథమ కర్తవ్యం అనే సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల అంశంపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2024 జూన్ తర్వాత 39 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీరికి పరిహారంగా రూ.7 లక్షల పునరావాస ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, 2024 జూన్‌కు ముందు 103 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం:అచ్చెన్నాయుడు

అసెంబ్లీలో చర్చ – మంత్రుల కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతుల సంక్షేమానికి అంకితమై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు ప్రసంగాన్ని ఓ ఉత్తమ చిత్రాన్ని చూసిన అనుభూతిని కలిగించేలా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడాం అనేది కాదని.. బుల్లెట్‌ దిగిందా? లేదా? అన్నట్లు ప్రసంగం ఉండాలని రఘురామ సరదాగా వ్యాఖ్యానించారు. సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడుతుంటే ఎంతమంది వింటున్నారనేది చూసుకోవాలని ఎవరి గోలలో వారు ఉంటే ప్రయోజనం ఉండదన్నారు. కొంతమంది కుర్రాళ్లు పుట్టుకతో వృద్ధులు అని శ్రీశ్రీ అన్నారు. కానీ కొందరు వృద్ధులు ఎప్పటికీ కుర్రాళ్లే అంటూ రఘురామ సరదాగా కామెంట్ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరిల, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిలు మాట్లాడే ముందు వారిని కుర్రాళ్లంటూ కామెంట్ చేశారు.

రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు 2024-25లో 81 ప్రతిపాదిత కేసులకు సంబంధించి రూ.5.67 కోట్లు మంజూరు. ఇప్పటి వరకు 49 మంది రైతుల కుటుంబాలకు రూ.3.43 కోట్లు విడుదల. మిగిలిన 32 కుటుంబాలకు రూ.2.24 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతుల ఆత్మహత్యల వెనుక నష్టపోయిన పంటలు, ఆర్థిక ఒత్తిళ్లు, ద్రవ్య లభ్యత లేకపోవడం వంటి సమస్యలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు కౌలు రైతులకు రుణ మాఫీ పంట నష్ట పరిహారం వేగవంతంగా విడుదల రైతు భరోసా పథకం అమలు పంటల బీమా పరిధిని విస్తరణ వ్యవసాయ మార్కెట్ ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత విస్తృత చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కేంద్రం సహాయంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఆలోచిస్తోంది. 9 నెలల కాలంలో 39 రైతుల ఆత్మహత్యల 2024 జూన్‌కు ముందు 103 కేసులు నమోదు
రూ.7 లక్షల పునరావాస ప్యాకేజీ 81 కేసులకు రూ.5.67 కోట్లు మంజూరు 49 కుటుంబాలకు రూ.3.43 కోట్లు విడుదల మిగిలిన 32 కుటుంబాలకు త్వరలో రూ.2.24 కోట్లు ప్రభుత్వం రైతులను అండగా నిలబెడుతూ, ఆర్థిక భద్రత కల్పించేందుకు వివిధ పథకాల ద్వారా సహాయం అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు
2:03

భట్టి విక్రమార్క నివాసానికి చంద్రబాబు: నూతన వధూవరులకు ఆశీస్సులు

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

జిల్లా పరిషత్ లో జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహణ

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

గ్యాస్ బుకింగ్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

ద్వారకా తిరుమలలో గ్యాస్ సిలిండర్ మాయం

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

శనివారం గోవింద నామస్మరణతో పులకిస్తున్న ఆధ్యాత్మిక నగరం.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

గ్యాస్ కొరతను సృష్టిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

ఆపరేషన్ వజ్రపహార్.. గంజాయి, రౌడీషీటర్లపై పోలీసుల ఉక్కుపాదం!

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

శ్రీవారి ఆలయంలో మార్చి నెలలో మూడు ఆస్థానాలు

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేక వైసిపి దుష్ప్రచారం

📢 For Advertisement Booking: 98481 12870