Chandrababu Naidu: వేంకటేశ్వరుడి దయతోనే మీ మధ్య ఉన్న: చంద్రబాబు నాయుడు

Read Time:  1 min
Chandrababu Naidu: వేంకటేశ్వరుడి దయతోనే మీ మధ్య ఉన్నా: చంద్రబాబు నాయుడు భావోద్వేగ వ్యాఖ్యలు
Chandrababu Naidu: వేంకటేశ్వరుడి దయతోనే మీ మధ్య ఉన్నా: చంద్రబాబు నాయుడు భావోద్వేగ వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులకు వెంగమాంబ అన్నవితరణ కేంద్రం వద్ద అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూనే రాష్ట్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు.

IMG 20180114 WA0044 1170x780

వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్

ఈ సంద‌ర్భంగా ఆలయాల నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేందుకు ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణానికి నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తాం. ఇది భవిష్యత్ తరాలకు పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అవుతుంది. ప్రజల నిధులతో ఆలయాల నిర్మాణం చేసి, ధార్మిక సేవలను పెంపొందించడమే లక్ష్యం అని చంద్రబాబు వెల్లడించారు. తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించార‌ని చంద్రబాబు గుర్తుచేశారు. ఈ కార్యక్రమం కొనసాగుతూ ప్రస్తుతం రూ.2,200 కోట్లు కార్పస్ ఫండ్గా ఏర్పాటైందని తెలిపారు. అన్నదానం ఒక మహత్తర కార్యక్రమం. ఇది ఎప్పటికీ కొనసాగాలి. నాడు ఎన్టీఆర్ అన్నదానం ప్రవేశపెట్టారు. నేను ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇప్పుడు మూడవ దశగా ఆలయాల నిర్మాణాన్ని చేపడుతున్నాను అని చెప్పారు.

 ప్రాణదానం కార్యక్రమం – చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తాను  ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించి తిరుమల నుంచి దిగుతున్న సమయంలోనే 24 క్లేమోర్ మైన్స్ పేల్చారని చంద్రబాబు గుర్తుచేశారు. అన్ని క్లేమోర్స్ పేల్చినా తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టడమే. నా ప్రాణాలను స్వామి రక్షించాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. 24 క్లేమోర్ మైన్స్ పేలితే ఎవరైనా ప్రాణాలతో తప్పించుకోలేరు. కానీ నేను బతికాను. అది స్వామివారి మహిమే! అని అన్నారు. తన మనవడు నారా దేవాన్ష్ జన్మదినాన్ని ప్రతిసారి తిరుమలలో నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రతి పుట్టినరోజున తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా భక్తులకు అన్నదానం చేయడం తమ కుటుంబం సాంప్రదాయంగా కొనసాగిస్తోందని తెలిపారు. ఆలయాల రక్షణ – స్వామి ఆస్తులపై అక్రమ కబ్జాలను అడ్డుకుంటాం. వేంకటేశ్వరస్వామి ఆస్తులను కబ్జా చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి ఆస్తులను ఎవరైనా కబ్జా చేస్తే వాటిని తిరిగి దేవుడికే చెందేలా చర్యలు తీసుకుంటాం. ఆలయాల అభివృద్ధికి ప్రతి రూపాయి దానం సరైన విధంగా ఉపయోగించబడుతుంది అని స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం, మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులను సమకూరుస్తామని చంద్రబాబు తెలిపారు. ధార్మిక ప్రచారాన్ని మరింత పెంచేందుకు గురువులు, పండితులు, భక్తులతో కలిసి ప్రభుత్వ స్థాయిలో ఒక సమాఖ్య ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆలయాల నిర్మాణం కీలకమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదు, భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టే ధార్మిక ఆందోళన. ప్రతి ఒక్కరు ఆలయ నిర్మాణాల్లో భాగస్వాములు కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.