हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

Sharanya
Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త:

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సోమవారం ప్రాజెక్ట్ సైట్ లో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు పోలవరం విచ్చేస్తారని, ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులలో డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. అనంతరం అధికారులతో సమీక్షిస్తారన్నారు.

27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు

ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించే ప్రదేశాలలో పనుల ప్రగతి సూచించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసి, వివరాలు సీఎం కి తెలియజేయాలన్నారు. ఆయా ప్రదేశాలలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలనీ పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే శాసనసభ్యులు, ప్రముఖులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముఖ్యమంత్రివర్యులు పాల్గొనే ప్రదేశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, వడదెబ్బ నివారణకు సంబందించిన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
అంతకుముందు డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డాం, లోయర్ కాఫర్ డాం, గ్యాప్ 1, గాప్ 2 , వైబ్రో కంప్రెషన్, తదితర పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ రమణ, పోలవరం ప్రాజెక్ట్ సూపెరింటెండెంటింగ్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, డిఈ డి.శ్రీనివాస్, సిఐ బాల్ సురేష్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870