हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Andhra Pradesh: ఏపీ డ్వాక్రా మహిళల కోసం మరో పథకం సిద్ధం

Ramya
Andhra Pradesh: ఏపీ డ్వాక్రా మహిళల కోసం మరో పథకం సిద్ధం

డ్వాక్రా మహిళల పిల్లల విద్యకు బాసటగా “ఎన్టీఆర్ విద్యా సంకల్పం” – ఏపీ ప్రభుత్వమే ప్రత్యక్ష హామీ

Andhra Pradesh: కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాలు ప్రభుత్వ అభిమతాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పటికే “సూపర్ సిక్స్” పథకాల అమలుకు రంగం సిద్ధమవుతుండగా, ఇప్పుడు డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా మరో కొత్త పథకాన్ని తీసుకొస్తోంది. “ఎన్టీఆర్ విద్యా సంకల్పం”గా దీనికి నామకరణం చేయడం ద్వారా విద్యారంగానికి ఎన్టీఆర్ పేరు జోడించి ఒక రకమైన మార్గదర్శకంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.200 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

Andhra Pradesh
Andhra Pradesh

స్త్రీనిధి ద్వారా 4% వడ్డీకే రుణాలు – పిల్లల చదువుకే వినియోగించాల్సిన నిబంధన

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న స్త్రీనిధి బ్యాంక్ ద్వారా రుణాలను మంజూరు చేయనున్నారు. ప్రతి అర్హత కలిగిన డ్వాక్రా మహిళకు రూ.10,000 నుంచి రూ.1 లక్ష వరకు రుణం అందించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రుణాలపై కేవలం 4 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని పిల్లల చదువు కోసం మాత్రమే వినియోగించాల్సిందిగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించారు. కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించనుండగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు అన్నింటికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు.

విద్య కోసం అవసరమైన అన్ని ఖర్చులకు అవకాశం – గుణాత్మక మార్గదర్శకాలు

పిల్లల విద్యా ఖర్చుల్లో భాగంగా ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్లు, ఇతర ఉపకరణాల కొనుగోలు, సాంకేతిక విద్యలో అవసరమైన ల్యాబ్ సామగ్రి వంటి వాటికి ఈ రుణాన్ని వినియోగించవచ్చు. అంతేకాక, విద్యార్థులు నివసిస్తున్న ప్రాంతం నుంచి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు అవసరమైన సైకిళ్లను కొనుగోలు చేసేందుకు కూడా ఈ పథకం అనుమతిస్తుంది. అయితే, రుణం తీసుకున్న అనంతరం అది విద్య కోసం వినియోగించామన్న ఆధారంగా సంబంధిత రశీదులు, బిల్లులు స్త్రీనిధికి సమర్పించాల్సి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించే వ్యవధి కనీసం 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలలుగా ఉండనుంది. వాయిదాల రూపంలో సులభంగా చెల్లించే విధంగా సౌకర్యాలు కల్పించనున్నారు.

త్వరలో అమలులోకి – సీఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించనున్న పథకం

ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించి అన్ని విధి విధానాలకు తుది రూపు ఇచ్చిన అధికారులు, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా దీనిని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా విద్యను ఓ సాధనం గా మలచుకుని, తద్వారా డ్వాక్రా కుటుంబాల ఆర్థిక భద్రతను పెంపొందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ పథకం అమలుతో లక్షల మంది డ్వాక్రా కుటుంబాల్లో విద్య పట్ల నమ్మకాన్ని పెంచే మార్గం సిద్ధమవుతుందని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో విద్య ద్వారా సామాజిక మార్పుకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Read also: AP: ఏపీలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల వెల్లడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870