Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో ఈ ఆలయం దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారేలా ఆకర్షణీయంగా అభివృద్ధి చేయనున్నారు.ఈ ఆలయం చుట్టూ భారీ ప్రాకారం ఉండగా, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తుల మహారాజ గోపురం నిర్మించనున్నారు. అంతేకాదు మూడు దిశల్లో ఐదు అంతస్తుల గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితోపాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి రూ.185 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇదే ఆలయాన్ని నిర్మించేందుకు 2016లో టీడీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది.

Advertisements
Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

అమరావతిలోని వెంకటపాలెం వద్ద 25 ఎకరాల భూమిని కేటాయించి, రూ. 150 కోట్ల వ్యయంతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు.2018లో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.అయితే కొన్ని కారణాల వల్ల ఆలయ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాజెక్టుకు నిర్దేశించిన రూ. 150 కోట్ల అంచనా వ్యయాన్ని కేవలం రూ. 36 కోట్లకు తగ్గించడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి.ఈ క్రమంలో ప్రధాన ఆలయం, లోపలి ప్రాకారం, ఒక రాజగోపురం, ధ్వజస్తంభ మండపం మాత్రమే నిర్మించబడింది.ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ఆలయ నిర్మాణాన్ని మరింత వేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించేందుకు అవసరమైన నిధులు, రివైజ్డ్ ప్రణాళికలతో ముందుకెళ్లనున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

Related Posts
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్

భారతదేశం, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. Read more

వైసీపీకి అయోధ్య రామిరెడ్డి గుడ్ బై..!
Goodbye to YCP Ayodhya Rami Reddy.

అమరావతి: విజయసాయిరెడ్డితో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా Read more

సీటెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల
exame

నిరుద్యోగులు ఎదురు చూస్తున సీటెట్‌ పరీక్ష ప్రకటన విడుదల అయింది.CTET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్‌ అడ్మికార్డులను సీబీఎస్సీ (CBSE) విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు Read more

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
New pass books in AP from April 1

ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ అమరావతి : ఏపీ రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×