ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మరోసారి మోదీపై నిప్పులు చెరిగారు.లక్నోలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మోదీకి ఝలక్ ఇచ్చారు.ముఖ్యంగా సుంకాల విధానం విషయంలో ప్రధాని డొనాల్డ్ ట్రంప్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అఖిలేశ్ మాట్లాడుతూ ట్రంప్ తన దేశాన్ని కాపాడేందుకు దిగుమతులపై సుంకాలు వేశాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా అలాంటి చర్యలు అవసరం,అని స్పష్టం చేశారు. చైనా దిగుమతులపై మనం కూడా ఆంక్షలు విధించాలా లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.ప్రస్తుతం భారత్ ఆర్థికంగా గందరగోళంలో ఉందన్నారు. ఉచిత రేషన్ పొందుతున్న వారి ఆదాయం ఎంత అనేది చెప్పగలరా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

దేశ ఆర్థిక స్థితిగతులపై తప్పుడు గణాంకాలు చూపుతున్నారని ఆయన ఆరోపించారు.ఇక ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు గల్లంతవుతున్నాయన్నారూ.గోరఖ్పూర్ అయోధ్యల వక్ఫ్ భూములను బీజేపీ లాక్కొనాలని చూస్తోంది, అని తీవ్ర ఆరోపణలు చేశారు. నేరాలపై యోగి ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.ఇప్పటి పరిస్థితుల్లో యోగి సర్కార్ నేరస్తులపై సైలెంట్ గా ఉంది. ప్రజల భద్రత గురించి ఈ ప్రభుత్వానికి పట్టింపులేదనే అనిపిస్తోంది, అని వ్యాఖ్యానించారు.అఖిలేశ్ వ్యాఖ్యలతో మళ్లీ ఉత్తరప్రదేశ్ రాజకీయ వేడి పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహంతో పార్టీ దూకుడు పెంచుతోందని విశ్లేషకుల అభిప్రాయం.ఈ వ్యాఖ్యలు బీజేపీకి ఎదురుదెబ్బగా మారుతాయా? లేక అఖిలేశ్ విమర్శలు రాజకీయ మైదానంలో మరో ప్రహసనంగా మిగిలిపోతాయా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.
READ ALSO : Harish Rao : బీఆర్ఎస్లో చేరిన పలువురు నాయకులు