हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

Sharanya
యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

ప్రేమికుల దినోత్సవం రోజునే ఏపీలో దారుణం జరిగింది ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేసి, అనంతరం యాసిడ్ దాడికి తెగబడిన ఘటన అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపింది. ప్రేమికుల దినోత్సవం రోజున జరిగిన ఈ అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి

గౌతమిపై ప్రేమ పేరుతో వేధింపులు:
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లి గ్రామానికి చెందిన గౌతమి, మదనపల్లెలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. అయితే, మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ ఆమెను ప్రేమించమంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు.

వివాహ నిశ్చయం – ప్రేమోన్మాది కిరాతక పథకం:
ఫిబ్రవరి 7న గౌతమికి పెళ్లి నిశ్చయం కాగా, ఏప్రిల్ 29న పీలేరుకు చెందిన శ్రీకాంత్‌తో వివాహం జరగాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన గణేష్ ఆమెను వేధించడం మితిమీరడంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. యువతికి వివాహం నిశ్చయమైందని తెలుసుకుని ఇలా దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.

దారుణ దాడి :
ఫిబ్రవరి 14న, గౌతమి తల్లిదండ్రులు పాలు పిండటానికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా తీసుకుని గణేష్ ఆమె ఇంట్లోకి చొరబడి, కత్తితో తలపై దాడి చేశాడు. దాంతో ఆగకుండా యాసిడ్ దాడికి కూడా పాల్పడ్డాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు:
దాడిలో తీవ్రంగా గాయపడిన గౌతమిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని గౌతమి వివరాలు తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి అమానుష దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870