మహిళలకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు..ఎక్కడ అంటే?

మహిళలకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు..ఎక్కడ అంటే?

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అండగా ఉండేందుకు మరో సంచలన నిర్ణయానికి తెరతీసింది. అధికారంలో ఉన్న సుఖ్వీందర్ సుఖు మహిళల సంక్షేమం కోసం పలు పథకాలను తీసుకుని వస్తున్నారు. తాజాగా ఇప్పటినుంచి మహిళా ఉద్యోగులకు 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవులు మంజూరు చేయనుంది. అయితే ఈ సెలవులు అందరు మహిళా ఉద్యోగులకు మాత్రం కాదని హిమాచల్ ప్రదేశ్ సర్కార్ తేల్చి చెప్పింది. గర్భిణీలకు డెలివరీ సమయంలో పుట్టిన బిడ్డ చనిపోవడం లేదా డెలివరీ తర్వాత బిడ్డను కోల్పోయిన ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు ఈ 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవును ఉంటుందని స్పష్టం చేసింది.
6 నెలలు ప్రసూతి సెలవులు
దీనికి సంబంధించి తాజాగా సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకు 180 రోజులు (6 నెలలు) ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. అయితే ఈ ప్రసూతి సెలవులకు ఎలాంటి అర్హతలు ఉండాలో.. కొత్తగా ప్రకటించిన ప్రత్యేక ప్రసూతి సెలవులకు కూడా అవే అర్హతలు అని హిమాచల్ సర్కార్ వెల్లడించింది. కానీ ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు మాత్రం డెలివరీ సమయంలో లేదా ఆ తర్వాత పుట్టిన శిశువు చనిపోయిన వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

Advertisements
ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే

ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే

అయితే గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో డెలివరీలు చేసుకున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రత్యేక ప్రసూతి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. 9 నెలల పాటు కడుపులో మోసిన బిడ్డ.. కళ్లు తెరిచే సమయంలో, తెరిచిన తర్వాత ప్రాణాలు కోల్పోవడం అంటే ఆ తల్లికి.. అంతకుమించిన శోకం ఇంకోటి ఉండదని హిమాచల్ ప్రభుత్వం తెలిపింది. అందుకే అలాంటి తీవ్ర విషాదకరమైన పరిస్థితుల కారణంగా వారికి కలిగే శారీరక, మానసిక బాధ నుంచి బయటికి వచ్చేందుకు ఈ 60 రోజుల స్పెషల్ మెటర్నిటీ లీవ్స్ ఉపయోగపడుతాయని పేర్కొంది.
ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా మహిళల ఆరోగ్యం, వారి శ్రామిక శక్తిని ఉపయోగించడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చెబుతుందని తెలిపాయి. ఇక ఇలాంటి విధానాన్ని తీసుకురావడం ద్వారా మంచి పాలనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అవుతుందని వెల్లడించాయి

Related Posts
Cows : గోమాతల్లో పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్
Cows గోమాతల్లో పవర్ ఉంటుంది పంజాబ్ గవర్నర్

Cows : గోమాతల్లో పవర్ ఉంటుంది : పంజాబ్ గవర్నర్ పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గో సంరక్షణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోమాతల్లో Read more

Modi : నా బలం నా పేరులో లేదు – మోదీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై మోదీ స్పందన

ప్రధాని నరేంద్ర మోదీ తన బలం తన పేరులో లేదని, దేశ ప్రజల మద్దతులో, భారతదేశ సంస్కృతి, వారసత్వంలో ఉందని తెలిపారు. ప్రజలు ఇచ్చే ఆదరణ, వారి Read more

GRAP దశ 4 అమలులో విఫలత: సుప్రీం కోర్టు సీరియస్
SCI

సుప్రీం కోర్టు, ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా అభ్యంతరించిందీ. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, సుప్రీం కోర్టు, "గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ Read more

మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం
Manmohan Singh funeral procession begins

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఉద‌యం 11.45 గంట‌ల‌కు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వహించ‌నున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ Read more

×