విజయ్ హజారే ట్రోఫీ 2024లో కర్ణాటక జట్టు అసాధారణ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి గ్రూప్-సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది.తాజాగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ కర్ణాటక జట్టు 300కి పైగా పరుగులు చేస్తూ మెరుపు ప్రదర్శనను కొనసాగించింది.కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఈ టోర్నీలో తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు.పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ జట్లపై సెంచరీలు కొట్టి, ఇప్పుడు హైదరాబాద్పై మరో సెంచరీతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడు.అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక జట్టు, మయాంక్ నాయకత్వంలో ధాటిగా ఆడింది. మయాంక్ తన ఇన్నింగ్స్ను ఆరంభం నుంచి శక్తివంతమైన షాట్లతో నింపాడు. అతని 112 బంతుల ఇన్నింగ్స్లో 2 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి.

మొత్తం 124 పరుగులు చేసి, టోర్నీలో వరుసగా మూడో సెంచరీని నమోదు చేశాడు.మయాంక్ తన ఫామ్ను ఇప్పటివరకు అద్భుతంగా కొనసాగిస్తున్నాడు. పంజాబ్ జట్టుపై 127 బంతుల్లో 139 పరుగులు చేసిన మయాంక్, అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 45 బంతుల్లో అజేయంగా 100 పరుగులు సాధించాడు.ఈ స్మాషింగ్ ఇన్నింగ్స్లతో మయాంక్ ప్రస్తుతం టోర్నీలో అత్యుత్తమ బ్యాట్స్మెన్గా నిలిచాడు.హైదరాబాద్తో మ్యాచ్లో కర్ణాటక జట్టు మంచి ఆరంభం చేసుకుని భారీ స్కోరు నమోదు చేసింది.మయాంక్ అగర్వాల్ మొదలైన ఉత్సాహం జట్టులో ఇతర ఆటగాళ్లకు కూడా సోకింది. కర్ణాటక జట్టు ఈ విజయంతో టోర్నీలో మరింత ముందంజ వేసింది. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఇతర జట్ల కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మయాంక్ అగర్వాల్తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మంచి ఫామ్లో ఉండటంతో, ఈ జట్టు మరిన్ని రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ విజయాల పరంపర కర్ణాటక జట్టును 2024 విజయ్ హజారే ట్రోఫీ ఛాంపియన్గా నిలుపుతుందా? వేచి చూడాలి!