పహల్గామ్ ఉగ్రవాద దాడి అలాగే కాశ్మీర్ పై చేసిన వివాదాస్పద ప్రకటనలతో తాజగా వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత హోదా, ఆర్మీ చీఫ్ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం అతని జీతం, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చాల ప్రశ్నలు తలెత్తుతాయి, కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితమైన లెక్కలను బహిరంగంగా వెల్లడించలేదు. కానీ పహల్గామ్ దాడి, కాశ్మీర్ గురించి చేసిన ప్రకటనలు అసలు అసిమ్ మునీర్కు పాకిస్తాన్ ఎంత జీతం ఇస్తుంది అని అనుమాలను వ్యక్తం చేసింది.

అసిమ్ మునీర్ కెరీర్
జనరల్ అసిమ్ మునీర్ మంగళాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ ద్వారా పాకిస్తాన్ సైన్యంలో చేరి, ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్లో చేరాడు. 2018 సంవత్సరంలో అతను త్రీ-స్టార్ జనరల్గా పదోన్నతి పొందాడు. తరివాత ఆయన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశారు, ఇక్కడ ఆయన పదవీకాలం ఎనిమిది నెలలు మాత్రమే కొనసాగింది. ప్రస్తుతం, ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు అంతేకాక ఆయన పదవీకాలం 2027 వరకు పొడిగించింది.
అసిమ్ మునీర్ జీతం
పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ జీతం, అలవెన్స్ గురించి సమాచారం బహిరంగంగా లేనప్పటికీ ఆర్మీ చీఫ్కు అత్యధిక జీతం, ప్రభుత్వ వసతి, భద్రత, వాహనం ఇంకా ఇతర సౌకర్యాలు కల్పించబడుతున్నాయని నమ్ముతారు. అంతేకాకుండా అతని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అలాగే ఇతర ప్రయోజనాలను కూడా ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ 2 లక్షల పాకిస్తానీ రూపాయల జీతం అందుకుంటున్నాడట. కాశ్మీర్ పై చేసిన ప్రకటన: కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనల కారణంగా భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వేగంగా పెరిగింది.
Read Also: Europe : చీకటి మయంగా మారిన యూరప్ దేశాలు