ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన పండుగగా పేరొందిన మహా కుంభ మేళా 2025లో ప్రయాగ్రాజ్ వేదికగా జరగనుంది.జనవరి 13న ప్రారంభమయ్యే ఈ మహా కుంభం మొత్తం 45 రోజుల పాటు కొనసాగుతుంది.ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున రాజస్నానంతో ఈ పండుగ ముగుస్తుంది.ఈ సార్వజనీన ఉత్సవం సనాతన ధర్మానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చేలా నిలుస్తుంది. ప్రయాగ్రాజ్లోని త్రివేణీ సంగమంలో జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున మొదటి రాజస్నానం జరుగుతుంది. ఈ మేలి శుభదినం పుణ్యస్నానాలకు అద్భుతమైన సమయంగా రిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం, మహాకుంభ స్నానం మానవ జీవితానికి మోక్షాన్ని అందించగలదు.ప్రతి కుంభమేళా మహాశివరాత్రి రోజున ముగియడం సంప్రదాయంగా వస్తోంది.2025 కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆధునిక సదుపాయాలు,భద్రతా చర్యలు తీసుకుంటోంది.హరిద్వార్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు.
ఇది జ్యోతిష్యశాస్త్రానికి అనుగుణంగా జరుగుతుంది.బృహస్పతి కుంభరాశిలో సంచరించేటప్పుడు,సూర్యుడు మేషరాశిలో ఉంటే, అదే సమయంలో హరిద్వార్లో మహా కుంభమేళా జరగాలి. 2021లో చివరిసారి హరిద్వార్లో ఈ పండుగ నిర్వహించబడింది.ఇకపై మళ్ళీ 2033లో హరిద్వార్ మహా కుంభ జరిగే అవకాశం ఉంది.హిందూ పురాణాల ప్రకారం, దేవతలు మరియు రాక్షసులు కలిసి సాగర మథనం నిర్వహించారు. ఈ మథనం వల్ల అమృతం కలిగిన భాండం ఉద్భవించింది.దేవతలు, రాక్షసులు ఆ భాండం కోసం యుద్ధం చేయగా, అందులో అమృతపు చుక్కలు 12 ప్రదేశాలకు చేరాయి.అందులో ఎనిమిది స్వర్గంలో పడి, నాలుగు భూమిపై పడ్డాయి. ఆ భూమిపై పడిన ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఈ కారణంగానే ఈ నాలుగు ప్రదేశాల్లో మాత్రమే కుంభమేళా నిర్వహించబడుతుంది. మహాకుంభ స్నానం చేసిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. పాపాలు, రోగాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ పండుగ, భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి కొత్త పుంతలు తొక్కేలా చేస్తుంది.