మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు శివుడిని భక్తిపూర్వకంగా పూజిస్తుండగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా అనేక మంది ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం శివభక్తులకు ప్రత్యేకమైనది. దేశం మొత్తం శివుని ఆరాధనతో మార్మోగిపోతున్న వేళ, ప్రజల ఆనందం, శాంతి, అభివృద్ధి కోసం నేతలు తమ ఆకాంక్షలు వ్యక్తం చేశారు.

మహాదేవుడి ఆశీర్వాదం అందరికీ లభించాలని – మోడీ
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహాదేవుడి ఆశీర్వాదం అందరికీ లభించాలని కోరుతూ ట్వీట్ చేశారు. “దేవాది దేవుడైన మహాదేవుడు భక్తులకు ఆశీస్సులు ప్రసాదించాలని, మన దేశం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పర్వదినం ప్రజలకు సంతోషం, ఆరోగ్యం, సౌభాగ్యం కలిగించాలని, దేశం మరింత బలపడాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.
మహాశివరాత్రి మనందరికీ శాంతి – రాహుల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి మనందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని, శివుని ఆశీస్సులతో దేశం పురోగమించాలని ఆకాంక్షించారు. పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులంతా శివారాధనలో నిమగ్నమై, రాత్రి జగరణలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.