Self employment scheme for unemployed youth.. Deputy CM

నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం : డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సాయం చేయనున్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్దిదారులకు పథకాలు అందుతాయి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే ఈ పథకంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది అని ఆశిస్తున్నారు.

Advertisements
నిరుద్యోగ యువత కోసం స్వయం

ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

కాగా, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19 లేదా 20న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి మూడు లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. మార్చి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం.

Related Posts
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్
r krishnaiah

తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాదిలోపు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో Read more

హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్న HCL
HCL HYD

హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టబోతుంది. HCL టెక్నాలజీస్ సంస్థ హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ Read more

రెండు రోజుల్లో వరద బాధితుల అకౌంట్లలో డబ్బులు వేస్తాం: చంద్రబాబు
CM Chandrababu held meeting with TDP Representatives

అమరావతి: ఇటీవల విజయవాడ నగరంలో బుడమేరు పొంగడంతో భారీ వరద ముంచింది. ఈ వరద కారణంగా చాలా ఇళ్లలోకి నీరు చేరి, ఆవాసాల్లోని అనేక వస్తువులు నష్టపోయాయి. Read more

రోజా కూతురు ర్యాంప్ వాక్ పిక్ వైరల్
Roja's daughter Anshu Malik

ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక తన ప్రతిభతో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన Read more

Advertisements
×