isro

నింగిలోకి విజయవంతంగా స్పేడెక్స్‌ ఉపగ్రహాలు

భారత అంతరిక్ష కేంద్ర ప్రయాగంలో మరో మైలురాయిని పూర్తి చేసుకుంది. విజయవంతంగా స్పేస్‌ డాకింగ్‌ పూర్తి చేసుకుంది. కొత్త సంవత్సర కానుకగా చరిత్రలో నిలబడడమే కాకుండా, అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేసింది.

ఈ మిషన్‌లో భాగంగా ఎస్‌డీఎక్స్‌01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌02 (టార్గెట్‌) ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ-సీ60.. వాటిని 476 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార భూ కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ కక్ష్యలో విడివిడిగా తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను కొద్దిరోజుల తర్వాత సంక్లిష్ట విన్యాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానం (డాకింగ్‌) చేయనున్నారు.


జంట ఉపగ్రహాల ప్రయోగం
భవిష్యత్‌ అంతరిక్ష ప్రయోగాలకు ఎంతో కీలకమైన ‘స్పేస్‌ డాకింగ్‌’ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. స్పేస్‌ డాకింగ్‌ కోసం భారత అంతరిక్ష పరిశోధనల కేంద్రం ఇస్రో చేపట్టిన జంట ఉపగ్రహాల ప్రయోగం (స్పేడెక్స్‌)లో తొలి అడుగు ఘనంగా పడింది.

ఈ మిషన్‌లో భాగంగా చేజర్‌, టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్‌.. వాటిని జాగ్రత్తగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని సోమవారం రాత్రి 9.58 గంటలకు నిర్వహించాల్సి ఉంది. కానీ.. అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా రెండు నిమిషాలు ఆలస్యంగా నిర్వహించారు.

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 10:15 గంటలకు నింగిలోకి ఎగిరిన రాకెట్‌.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం తొలి ఉపగ్రహాన్ని 15.10 నిమిషాలకు, రెండో ఉపగ్రహాన్ని 15.13 నిమిషాలకు భూమికి 476 కిలోమీటర్ల ఎత్తున, వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. దీంతో మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.


Related Posts
ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం..
Two judges who took oath in AP High Court

అమరావతి : ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్‌ యడవల్లి Read more

kennedy murder : కెన్నడీ హత్య గుట్టు రట్టు చేసిన ట్రంప్
కెన్నడీ హత్య గుట్టు రట్టు చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యోదంతానికి కు సంబంధించిన ప్రభుత్వ రహస్య పత్రాలన్నింటినీ కూడా Read more

నేటి నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు
Srivari Teppotsavam from today

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ(మార్చి 09) రాత్రి 07 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. 13వ తేది వరకు ప్రతిరోజూ రాత్రి 07 Read more

ఈవీలకు పన్ను రాయితీ – ఏపీ ప్రభుత్వం
Tax concession for EVs AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) కొనుగోలుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు అధికారికంగా Read more