ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాల్లో బీజేపీ గెలవగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలలో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలను కమలం పార్టీ మొదలుపెట్టింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలిసింది. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 19 లేదా 20న జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ శాసనసభా పక్ష సమావేశం ఫిబ్రవరి 17 లేదా 18న జరిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగించికుని ఇవాళ లేదా రేపు ఉదయానికి ప్రధాని ఢిల్లీకి రానున్నారు. ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యే అవకాశం ఉంది.

Advertisements
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు


అమిత్ షా, జేపీ నడ్డాలతో ప్రధాని భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ వచ్చిన వెంటనే ప్రధానితో అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్య నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీతో చర్చలు జరిపి ఈ నెల 17, 18 తేదీల్లో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. 19 లేదా 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ పదవులకు ఎంపిక చేస్తారు.
ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో సహా ఆ పార్టీ కీలక నాయకులు పరాజయం పాలయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ప్రభుత్వ అధిపతిని నిర్ణయించడానికి ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించింది. ఐదుగురు నాయకులు కీలక పోటీదారులుగా ఉద్భవించారు.
పర్వేష్ వర్మకె ఎక్కువ అవకాశాలు
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ.. ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడేవారి జాబితాలో ముందున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేసిన సీనియర్ బీజేపీ నేత విజయేందర్ గుప్తా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కీలక బ్రాహ్మణ నేత సతీష్ ఉపాధ్యాయ్, కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశిష్ సూద్, వైశ్య సమాజానికి చెందిన ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ ఇతర పోటీదారులుగా ఉన్నారు.

Related Posts
IPL :ఐపీఎల్ మ్యాచ్ లకు అంపైర్ గా తన్మయ్ శ్రీవాస్తవ
IPL :ఐపీఎల్ మ్యాచ్ లకు అంపైర్ గా తన్మయ్ శ్రీవాస్తవ

భారత క్రికెట్‌ జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు అండర్-19 జట్టులో ఆడిన ఓ క్రికెటర్ ఇప్పుడు ఐపీఎల్‌లో అంపైర్‌గా కొత్త Read more

భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఆయన రాజీనామాకు దారితీయవచ్చు. లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న Read more

PM Modi: పాంబన్‌ బ్రిడ్జి ప్రారంభించిన మోదీ
పంబన్ బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ

పాంబన్‌ రైల్వే బ్రిడ్జ్, దేశంలో తొలి సముద్రపైన రైల్వే వంతెనగా పేరుగాంచింది. ఇది 100 సంవత్సరాలుగా రామేశ్వరం, తమిళనాడు మధ్య రైలు రాకపోకలకు ఉపయోగపడుతూ వచ్చింది. దీనిలో Read more

Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఖరారు
Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఖరారు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఖరారైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌షా Read more

Advertisements
×