Kaushik Reddy

కౌశిక్ రెడ్డిపై 3 కేసులు

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం కూడా ఫిర్యాదు చేయగా.. ఆయన ఫిర్యాదు మేరకు మూడో కేసు నమోదు చేశారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్‌ టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Advertisements


రసాభాసగా మారిన సమావేశం
ఆదివారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే జిల్లా ఇంచార్జ్‌ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుపడ్డారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్‌ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ ఒకర్నొకరు తోసుకొని కొట్టుకున్నంత పని చేశారు. మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు సమక్షంలోనే గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ్నుంచి తరలించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Related Posts
మంత్రి పొంగులేటిపై కవిత ఫైర్
kavitha ponguleti

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తన పెద్ద దుమారాన్నే రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల Read more

దాడి ఆరోపణలను ఖండించిన కౌశిక్ రెడ్డి
దాడి ఆరోపణలను ఖండించిన కౌశిక్ రెడ్డి

మాజీ కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి Read more

Miyapur : మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం..కానిస్టేబుల్‌ మృతి
Lorry rams into traffic personnel, constable dies

Miyapur : మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో Read more

Hanuman Jayanti: నగరంలో శాంతియుతంగా కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర
Hanuman Jayanti: నగరంలో శాంతియుతంగా కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర

హనుమాన్ శోభాయాత్రతో మార్మోగిన హైదరాబాద్ హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరం శోభాయాత్రలతో మార్మోగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. Read more

Advertisements
×