electric buses telangana

ఆర్టీసీలోకి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు – సీఎం రేవంత్

తెలంగాణలో పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యత ఇస్తూ, త్వరలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ముందంజ లో ఉందని, ఈవీల అమ్మకాల్లో అగ్రస్థానాన్ని సాధించిందని ఆయన వెల్లడించారు. ప్రజాసౌకర్యాన్ని పెంపొందించడంతో పాటు, పరిమాణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

Advertisements
CM Revanth Reddy visit to Karimnagar and Nizamabad districts today

హైదరాబాద్‌ ఎలక్ట్రిక్ వాహనాల రాజధాని

హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహనాల రాజధానిగా మారుస్తామని సీఎం స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) నుంచి ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్) వరకు మెరుగైన కనెక్టివిటీతో మాన్యుఫాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు ఆహ్వానం

ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం విస్తృత కార్యాచరణ సిద్ధం చేసిందని వెల్లడించారు. ఈవీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ, ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్‌లు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు, ప్రజలకు అధునాతన రవాణా సేవలను అందించేలా మారుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

Related Posts
రేపటి నుండి ‘అమరన్’ సినిమా OTTలో స్ట్రీమింగ్ ప్రారంభం
amaran ott

ప్రముఖ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన "అమరన్" సినిమా రేపటి నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ Read more

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కేటాయింపును కేంద్రం రద్దు చేసింది: అతిషి
ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కేటాయింపును కేంద్రం రద్దు చేసింది: అతిషి

మూడు నెలల్లో రెండోసారి ముఖ్యమంత్రి నివాసం కేటాయింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత Read more

YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత
deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో Read more

వర్షాలు దెబ్బకు..నీటమునిగిన టెక్ క్యాపిటల్
The rains hit the tech capi

దేశ టెక్ క్యాపిటల్ బెంగళూరు భారీ వర్షాలకు అతలాకుతలమైంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఐటీ కారిడార్ నీటమునిగింది. రోడ్లపై వరదనీరు నిలిచి ఉన్న వీడియోలు వైరల్ Read more

Advertisements
×