జగన్ కాన్వాయ్ కింద పడి సింగయ్య మృతి – భయానక దృశ్యాలపై షర్మిల (YS Sharmila) ఆవేదన
Vijayawada: వైసీపీ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వ్యాఖ్యానించారు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఈ ఘటన ఉందన్నారు. ఆదివారం పీసీసీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఈ ఘటనకు జగన్ బాధ్యత వహించాలన్నారు. కారు కింద ఒక వ్యక్తి పడ్డారన్న సోయి లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటి ? 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ గారు చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు ? బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా ? ఇదేం రాజకీయం ? ఇదెక్కడి రాక్షస ఆనందం ? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కు కుంటూ పోతారా? ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా ? కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్ గారి బాధ్యత రాహిత్యాని అద్దం పడుతుంది. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి.

పర్మిషన్ లేకుండానే జనసమీకరణ – పోలీసులు మౌనంగా ఎందుకు?
పర్మిషన్ కు విరుద్ధంగా జన సమీకరణ జరుగు తుంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు ? ఎందుకు ఇంటలిజెన్స్ వ్యవస్థను నిద్రపుచ్చారు ? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారు. దీక్షలను భగ్నం చేస్తారు. ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం ఇస్తారు ? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ? ఏం చర్యలు తీసుకుంటున్నారు ? అంటూ ప్రశ్నించారు. కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? అన్నారు. ఇది పూర్తిగా వైఎస్ జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్ (Jagan) తోపాటు వంద మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉందని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పర్మిషన్కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారని సందేహం వ్యక్తం చేశారు. వారు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్రపుచ్చారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే.. ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? అంటూ ఆవేదన చెందారు. కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్ అరెస్ట్లు చేస్తారన్నారన్నారు. అలాగే తమ పార్టీ చేసే దీక్షలను భగ్నం చేస్తారని.. ఆ క్రమంలో ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు వైఎస్ జగన్ ఏం సమాధానం ఇస్తారన్నారు.