పవన్ కుమారుడి ప్రమాదంపై జగన్ స్పందన

YS Jagan: పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించిన జగన్

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన విషయం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆయన గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై అభిమానులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

జగన్ స్పందన

ఈ విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందన ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి, మానవీయ కోణంలో స్పందించిన ఆయన మాటలు హృదయాలను తాకాయి. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) వేదికగా స్పందించిన జగన్, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను – అని జగన్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు వైఎస్ అభిమానులే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షాతిరేకంగా స్పందిస్తున్నారు. రాజకీయ శత్రువుల మధ్య మానవీయత ఉన్నదని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఇక ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌, మాజీ మంత్రి కేటీఆర్, చిరంజీవి త‌దిత‌రులు స్పందించారు. ప‌వ‌న్ కుమారుడు గాయ‌ప‌డ‌డం ప‌ట్ల దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సింగపూర్‌లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతున్నట్టు సమాచారం. గాయాలు పెద్దగా ప్రమాదకరంగా లేవని, మానసికంగా మాత్రం చిన్నారి ఉలిక్కిపడినట్టు మెడికల్ బులిటన్ తెలిపింది. పవన్ కళ్యాణ్ కుటుంబం ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నట్టు తెలిసింది.

Read also: Kia Motors: కియా కంపెనీలో భారీగా కారు ఇంజన్లు మాయం

Related Posts
అప్పుల పాలైన అన్నదాతలపై కక్ష ఎందుకు?: కేటీఆర్‌
అప్పుల పాలైన అన్నదాతలపై కక్ష

హైదరాబాద్‌: ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటని, మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. వ్యవసాయరంగంలో Read more

తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
తిరుమల కొండపై అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. తిరుమలలో Read more

తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు
Two key agreements in Telangana on the same day

ఇప్పటి వరకు 53 భారీ హోర్డింగులను తొలగించిన హైడ్రా హైదరాబాద్‌: తెలంగాణకు గూగుల్ గుడ్‌ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ కేంద్రంగా ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. Read more

లోకేశ్ సంక్రాంతి గిఫ్ట్.. రిప్లై ఇచ్చిన బ్రాహ్మణి
brahmaninara

సంక్రాంతి పండుగ వేళ, మంత్రి నారా లోకేశ్ తన భార్య బ్రాహ్మణికి మంగళగిరి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మంగళగిరి చేనేతను ప్రోత్సహించడం, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×