ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండగా గుర్తింపు పొందిన A23a ఇప్పుడు ముక్కలు ముక్కలుగా విడిపోతుంది.ఇది పెద్ద ఎత్తున పరిణామాలను కలిగించనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.నాసా విడుదల చేసిన తాజా ఉపగ్రహ చిత్రాలు (Latest satellite images released by NASA) ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిల్లో A23a మంచు కొండ (A23a Snowy mountain) లో నుంచి చిన్న ముక్కలు విరగడాన్ని స్పష్టంగా చూడవచ్చు.ఇవి సముద్రంలో తేలుతూ నౌకయానానికి అడ్డంకులు కలిగిస్తున్నాయి (These are floating in the sea and causing obstacles to navigation).A23a మొదట 1986లో అంటార్కిటికా పరిసరాల ఫిల్చ్నర్-రోన్ ఐస్ షెల్ఫ్ నుంచి విడిపోయింది. అప్పటి నుంచి అది అక్కడే నిలిచి పోయింది.కానీ 2023లో అది కదలడం ప్రారంభించింది. అప్పట్నుంచి ఇది ప్రపంచంలో అతిపెద్ద ఫ్లోటింగ్ ఐస్బర్గ్గా మారింది.ప్రస్తుతం A23a దక్షిణ అట్లాంటిక్లోని సౌత్ జార్జియా దీవి వద్ద ఉంది.ఇది అక్కడే కరిగిపోయే అవకాశం ఉంది లేక( A23a Iceberg) ‘ఐస్బర్గ్ గ్రేవ్యార్డ్’ గా పిలిచే ప్రాంతంలో కలిసి పోవచ్చు.

ప్రమాదకర విరిగే ప్రక్రియ కొనసాగుతోంది
ఈ పెద్ద మంచుకొండ ఇప్పుడు “ఎడ్జ్ వెస్టింగ్” అనే ప్రక్రియలో భాగంగా విడిపోతుంది.అంటే, కొండ అంచుల నుంచి చిన్న ముక్కలు వేరవడం జరుగుతోంది.ప్రస్తుతం విడిపోయిన అతిపెద్ద ముక్క A23c అని పిలుస్తున్నారు.దీని విస్తీర్ణం సుమారు 50 చదరపు మైళ్లు.ఇప్పటికే 200 చదరపు మైళ్లు తగ్గిపోయిన A23a ఇంకా పూర్తిగా కరగడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు.
పెంగ్విన్లకు కొత్త అడ్డంకి
సౌత్ జార్జియా దీవి చుట్టూ 20 లక్షలకుపైగా పెంగ్విన్లు జీవిస్తున్నాయి.A23a దీవికి దగ్గరగా ఉండటం వల్ల ఈ పెంగ్విన్లు ఆహారం కోసం మరింత దూరం ప్రయాణించాల్సి రావచ్చు.ఇది వాటి జీవన శైలిని మార్చే ప్రమాదం ఉంది.కావున, ఈ విరిగే మంచు ముక్కల వల్ల స్థానిక సముద్ర ఉష్ణోగ్రతలు,లవణీయత కూడా మారే అవకాశముంది.ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.
నౌకలకు ఆపద – శ్రద్ధ అవసరం
విడిపోయిన కొన్ని మంచు ముక్కలు అర మైలు వెడల్పు వరకు ఉన్నాయి.రాత్రి సమయాల్లో ఇవి కనిపించకుండా ప్రమాదంగా మారవచ్చు.సముద్ర ప్రయాణాలకు ఇది పెద్ద ముప్పు.అయితే, ఈ కరుగుతున్న మంచు కొన్ని పోషకాలు విడుదల చేయవచ్చు.ఇవి సముద్ర జీవులకు కొంతమేర మేలు చేస్తాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.
వాతావరణ మార్పుల హెచ్చరిక
ఈ ఘటన వాతావరణ మార్పులు ఎలా ప్రభావం చూపుతున్నాయో చూపించే ఉదాహరణ.భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.అంటార్కిటికాలో మంచు వేగంగా కరిగిపోవడం, సముద్ర మట్టాల పెరుగుదలకు కారణం కావచ్చు.ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కలిగిస్తుంది.
Read Also : Delhi : ఢిల్లీ యమునా తీరంలో తోడేలు కలకలం