ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజు మహిళల హక్కులను గుర్తించి,పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తూ, సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు.ఒకప్పుడు కుటుంబ వ్యవస్థకు మాత్రమే పరిమితమైన మహిళలు, నేడు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత సంపాదించి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలు సాధిస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
మహిళా దినోత్సవ చరిత్ర
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20వ శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాల ఫలితంగా ఏర్పడింది. మొదటిసారిగా 1909లో అమెరికాలో ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. 1908లో న్యూయార్క్లో గార్మెంట్స్ కార్మిక మహిళలు తక్కువ పని గంటలు, మంచి వేతనం, ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల కోసం ప్రేరణగా నిలిచింది. 1910లో డెన్మార్క్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 1911లో జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్ లలో తొలిసారి ఈ వేడుకలు జరిగాయి. 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఈ దినోత్సవాన్ని గుర్తించి, 1977లో మార్చి 8ను మహిళా హక్కుల దినంగా ప్రకటించింది.
2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్
ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్ ఆధారంగా జరుపుకుంటారు. 2025 సంవత్సరం థీమ్ మహిళలు, బాలికల హక్కులు, సమానత్వం, సాధికారతపై ఆధారపడి ఉంటుంది.ఇది మహిళల జీవితాలను మెరుగుపరచడానికి, వేగవంతమైన పురోగతికి పిలుపునిస్తుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించడానికి, సమాన అవకాశాలను అందించడానికి,వివక్షను తొలగించడానికి చర్యలు తీసుకోవడానికి ప్రజలను, ప్రభుత్వాలను, సంస్థలను ప్రేరేపిస్తుంది. ఈ థీమ్ మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ విజయాలను గుర్తించడమే కాకుండా, వేగవంతమైన పురోగతికి పిలుపునిస్తుంది. సమాజంలో మహిళల స్థాయిని పెంచే విధంగా సర్కార్లు, సంస్థలు, ప్రజలు కృషి చేయాలని ప్రేరేపిస్తుంది.

మహిళా దినోత్సవ ప్రాముఖ్యత
ఈ దినోత్సవం ప్రధానంగా లింగ వివక్షను తగ్గించడానికి, మహిళల సాధికారతను పెంచడానికి, సమాన అవకాశాలను కల్పించడానికి, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, సామాజిక సమూహాలు ఈ సందర్భంగా ప్రముఖ మహిళలను గౌరవిస్తూ, మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
ముఖ్యమైన సందేశం
ఈ రోజు ప్రపంచంలోని మహిళలకు అత్యంత ముఖ్యమైనది. అందువల్ల మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వంతో సహా వివిధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
అందుకే, ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం – సమానత్వాన్ని ప్రోత్సహిద్దాం!