Why caste census is not done in the country.. Rahul Gandhi

దేశంలో కులగణన ఎందుకు చేయడంలేదు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లోక్‌సభలో సోమవారంనాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటున్నాయని విమర్శించారు. మేకిన్ ఇండియా పథకం ఉద్దేశం మంచిదేనని, కానీ ఇప్పటిదాకా ఆ పథకంతో ఒరిగిందేమీలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 90 శాతం మంది వెనుకబడినవాళ్లేనని తెలిపారు. దేశంలో కులగణన ఎందుకు చేయడంలేదని ఎన్డీయే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఉత్పత్తుల పెంపుపై భారత్ దృష్టి సారించాలని సూచించారు. సాఫ్ట్ వేర్ విప్లవం గేమ్ చేంజర్ లా నిలుస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. చాలా సంస్థలు ఉత్పాదనలు పెంచడానికి ప్రయత్నించాయని, కానీ తయారీ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోయిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మొత్తం ఉత్పత్తులను చైనాకు అప్పగించామని అన్నారు. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని అన్నారు. మేకిన్ ఇండియా ఆచరణలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలమయ్యారని రాహుల్ గాంధీ అన్నారు.

image

మహారాష్ట్ర ఎన్నికల ముందు అకస్మాత్తుగా 70 లక్షల ఓట్లు పెరిగాయని, ఓటర్ల సంఖ్య ఉన్నట్టుండి ఎందుకు పెరుగుతోందో ఈసీ చెప్పాలని అన్నారు. 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జీడీపీ పడిపోయిందని… 2014లో 15.3 శాతం ఉన్న జీడీపీ 12.6 శాతానికి పడిపోయిందని వివరించారు. ఏఐలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందని తెలిపారు.

Related Posts
కల్పన ఆత్మహత్య కేసులో భర్తని విచారిస్తున్న పోలీసులు
కల్పన ఆత్మహత్య కేసులో భర్తని విచారిస్తున్న పోలీసులు

కల్పన ఆత్మహత్యాయత్నం: నిద్ర మాత్రలు మింగి పరిస్థితి విషమం ప్రపంచానికి తన గాత్రంతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ప్రముఖ నేపథ్యగాయని కల్పన నిద్ర మాత్రలను Read more

కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఓ కుటుంబం : సీఎం
A family earned Rs. 30 crores at the Kumbh Mela.. CM

లక్నో: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అసెంబ్లీలో మహా కుంభమేళా పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. కుంభమేళా వల్ల ఎంతోమంది Read more

మాధవీలతపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
madavilatha JC

బీజేపీ నేత, నటి మాధవీలతపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ Read more

భారత మహిళకు యూఏఈ లో అమలు చేసిన మరణ శిక్ష
యూఏఈలో అమలు చేసిన మరణశిక్షపై భారత్‌లో పెరుగుతున్న ఆందోళనలు

ఈ కేసు భారతీయుల కోసం ఆందోళన కలిగించే పరిణామం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) లో భారతీయ మహిళ షహజాదీ ఖాన్ మరణశిక్షను అమలు చేయడం అనేక Read more