I will not leave Jagan no matter how much he harasses me.. Perni Nani

Perni Nani : ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్‌ను విడిచి వెళ్లను : పేర్ని నాని

Perni Nani : వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపినా కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటన చేశారు. కక్ష సాధింపులో భాగంగా తమపై కేసులు పెడుతున్నారని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీని వీడిచే ప్రసక్తి లేదన్నారు.

Advertisements
ఎన్ని వేధింపులకు గురి చేసినా

తనను జైలుకు పంపించిన పర్వాలేదు

రేషన్ బియ్యం కుంభకోణం కేసులో పెర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని మచిలీపట్నం పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఇలాంటి నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపించిన పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం వీడేది లేదన్నారు. తమ కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ మరెవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదని పేర్ని నాని అన్నారు.

ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదు

సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదని సీజ్ ది షిప్, సీజ్ ది గోడౌన్ అన్నాకూడా ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదని చెప్పారు. వాళ్లందరిపై కేవలం 6ఏ కేసు మాత్రమే పెట్టారని తెలిపారు. తనకు ముందు కానీ… తన తర్వాత కానీ ఒక్కరిపై కూడా క్రిమినల్ కేసు పెట్టలేదని చెప్పారు. తనపై కక్ష కట్టారనే విషయం దీంతో అర్థమవుతుందని అన్నారు. తనను, తన భార్యను, తన కొడుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని చెప్పారు.

Related Posts
తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ ను వాడేశారు
powerbill

తెలంగాణలో వేసవి ఇంకా ప్రారంభమవ్వకముందే విద్యుత్ వినియోగం రికార్డులు తిరగరాస్తోంది. రాష్ట్ర ప్రజలు 16,293 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తూ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఇటీవల ఫిబ్రవరి Read more

AP HighCourt : కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌
Arguments on Kakani anticipatory bail petition concluded... verdict reserved

AP HighCourt: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు Read more

ఢిల్లీలో భూకంపం
delhi earthquake feb17

ఉదయం స్వల్ప భూకంపం ఢిల్లీలో భూకంపం.దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదైనట్లు భూకంప పరిశీలన కేంద్రాలు Read more

ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి కారణం అదే – జగన్
ycp walkout assembly

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి అసలు కారణం ప్రజా సమస్యలపై తమకు సమయం ఇవ్వాల్సి వస్తుందనే భయమే అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×