రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇన్నాళ్లు సాగడానికి బైడెన్ సర్కారే కారణమని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతోనూ చెప్పారు. మీ వద్ద అమెరికా ఆయుధాలు లేకపోతే రెండు వారాల్లో యుద్ధం ముగిసేదని జెలెన్ స్కీ ముఖంపైనే ట్రంప్ చెప్పడం జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోవడం తాలూకు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో జెలెన్ స్కీ తాజా వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. మేం కోరుకున్నంత ఎక్కువగా ఎవరూ శాంతిని కోరుకోవడం లేదు. పుతిన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం కంటే వృథా పని ఇంకొకటి లేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పుతిన్ గత పదేళ్లలో పాతిక సార్లు ఉల్లంఘించాడు. మరి మా భద్రతకు ట్రంప్ హామీ ఇస్తారా? భద్రతపై స్పష్టమైన హామీ లేకుండా కాల్పుల విరమణ మాకు ప్రమాదకరం. మనస్ఫూర్తిగా శాంతిని కోరుకోవడమే సమస్యలకు అసలైన పరిష్కారం. ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటుందనే సందేశాన్ని బలంగా వినిపిస్తాం” అని జెలెన్ స్కీ వివరించారు.
సాధారణంగా
రష్యా ఏటా ‘విక్టరీ డే’ ను ఘనంగా నిర్వహిస్తుంది,ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఈ నెల 9న విక్టరీ డే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేశారు. విక్టరీ డే వేడుకల కోసం రష్యా వెళ్లే విదేశీ ప్రముఖుల ప్రాణాలకు హామీ ఇవ్వలేమని వార్నింగ్ ఇచ్చారు. అతిథులకు రక్షణ కల్పించే బాధ్యత రష్యాదే కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఏదైనా జరిగితే తమకు బాధ్యత లేదని తేల్చిచెప్పారు.రష్యా, ఉక్రెయిన్ ల మధ్య మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు దేశాల్లో నిరంతరం బాంబులు పేలుతున్నాయి. భారీ విధ్వంసం జరుగుతోంది. వైమానిక దాడులు, డ్రోన్ అటాక్ లు సాధారణంగా మారాయి.

ప్రతినిధి
ఈ క్రమంలో విక్టరీ డే వేడుకల కోసం రష్యా కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. మూడు రోజుల పాటు కాల్పులు, బాంబు దాడులు ఆపేద్దామని ఉక్రెయిన్ కు సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనను జెలెన్ స్కీ తోసిపుచ్చారు. అమెరికా చెప్పినట్లు నెల రోజుల పాటు కాల్పుల విరమణకు తాము సిద్ధమని చెప్పారు.అంతే కానీ రెండు రోజులు, మూడు రోజులు కాల్పులు ఆపేద్దామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తాజాగా ఈ బెదిరింపులపై రష్యా స్పదించింది. ‘కవ్వింపులు వాస్తవంలోకి మారితే మే 10న కీవ్లో ఎవరూ ఉదయాన్ని చూడలేరు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
Read Also :Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం మొదలు కాబోతోందా?