న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రోడ్డుప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చలాన్లు తప్పవు.అయితే, స్పీడ్ చెక్లో పారదర్శకత కోసం కేంద్రం నూతన నిబంధనలను అమలు చేయబోతున్నది. రాడార్ ఆధారిత స్పీడ్ కొలిచే పరికరాలకు ఇక నుంచి తప్పనిసరిగా లీగల్ మెట్రాలజీ శాఖ నుండి ధృవీకరణ, ముద్ర అవసరం అనే కొత్త నిబంధనను శుక్రవారం కేంద్రం విడుదల చేసింది.ఈ కొత్త నియమాలు 2025, జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. దీంతో పరిశ్రమలు, పోలీస్ శాఖలు తగిన సన్నాహాలు చేసుకునే సమయం లభించనుంది.ఈ రూల్స్ అమలుతో, రోడ్లపై వేగాన్ని కొలిచే పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా ట్యాంపరింగ్ జరిగిందా?

అనే అనుమానాలకు ఆస్కారం ఉండదు.స్పీడ్ గన్లు, డాప్లర్ రాడార్ వంటి పరికరాలు ఇక నుంచి తక్కువ పొరపాటుతో ఖచ్చితమైన డేటా ఇస్తాయి.ఇలా ధృవీకరించిన పరికరాల వల్ల ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.వేగం పెరిగిందని చలాన్లు వేయడమంటే ఎప్పుడూ వివాదమే. కానీ ఇక మీదట, ధృవీకరించిన పరికరాల ద్వారా వేగాన్ని కొలవడం వల్ల న్యాయంగా జరగనిది జరగదు.ఎవరూ అన్యాయంగా జరిమానా విధించలేరు.ఇది డ్రైవర్లలో భద్రతా భావాన్ని పెంచుతుంది.
పోలీస్ శాఖకు కూడా ఆధారాలతో enforcement చేసే అవకాశం లభిస్తుంది.ఈ నూతన నిబంధనలు ఓ అంతర్జాతీయ ప్రమాణమైన OIML R 91 ఆధారంగా రూపొందించబడ్డాయి.దీనిలో రాష్ట్ర లీగల్ మెట్రాలజీ శాఖలు, ప్రైవేట్ తయారీదారులు, వినియోగదారుల సంఘాలు పాల్గొని తమ అభిప్రాయాలు ఇచ్చారు.పరిశీలనలు, ప్రజాభిప్రాయాలతో తయారైన ఈ నిబంధనలు నాణ్యతకు, పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనం.రాడార్ ఆధారిత స్పీడ్ కొలిచే పరికరాలు తయారు చేసే కంపెనీలకు ఇది మంచి అవకాశంగా మారుతుంది. ప్రభుత్వం క్లియర్ టెక్నికల్ మార్గదర్శకాలు ఇచ్చిన కారణంగా తయారీదారులు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. భారత తయారీదారుల ప్రమాణాలు పెరిగితే, విదేశీ మార్కెట్లో వారికి డిమాండ్ పెరుగుతుంది.ఈ రూల్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఫలితంగా ప్రాణ నష్టం, ఆర్థిక భారం తగ్గుతుంది. వాహనాల పోకడల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. ఎలాగైనా టెక్నాలజీ ఆధారంగా ట్రాఫిక్ను నియంత్రించే దిశగా ఇది గట్టి అడుగు అని చెప్పాలి.ఇక మీదట స్పీడ్ చెక్ల్లో ఎవరికీ అన్యాయం జరగదు. పరికరాలన్నీ శాస్త్రీయంగా నిర్ధారించబడి ఉంటాయి. ఇది ట్రాఫిక్ పరిరక్షణలో దేశం ముందడుగు వేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : ఛత్తీస్గఢ్లో 22 మంది మావోయిస్టులు లొంగుబాటు