Vande Bharat train to run to Kashmir on April 19

Kashmir : ఏప్రిల్‌ 19న కశ్మీర్‌కు పరుగులు వందేభారత్‌ రైలు

Kashmir : తొలిసారి వందేభారత్‌ రైలు కాశ్మీర్‌లోయలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 19న తొలి వందే భారత్‌ రైలు కాట్రా నుంచి కశ్మీర్‌కు పరుగులు పెట్టనుంది. ఉదంపుర్‌-శ్రీనగర్‌- బారాముల్లా మధ్య 272 కి.మీల మేర ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైలు లింక్‌ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 19న ప్రధాని మోడీ ఉదంపుర్‌ వస్తారని.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.

Advertisements
ఏప్రిల్‌ 19న కశ్మీర్‌కు పరుగులు

కొనసాగుతున్న జమ్మూ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనులు

అనంతరం కాట్రా నుంచి వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. జమ్మూ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్మూ- కాట్రా- శ్రీనగర్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ తొలుత కాట్రా నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు లింక్‌ ప్రాజెక్టు గత నెలలోనే పూర్తయిందని.. ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా నిర్వహించగా రైల్వే సేఫ్టీ కమిషన్‌ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రారంభోత్సవంతో కశ్మీర్‌కు ప్రత్యక్ష రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్‌ నెరవేరనట్లవుతుంది.

ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కి.మీల పొడువునా 38 సొరంగాలు

కశ్మీర్‌ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైనప్పటికీ.. అనేక భౌగోళిక, వాతావరణ సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కి.మీల పొడువునా 38 సొరంగాలు ఉండగా.. వీటిలో 12.75 కి.మీల మేర నిర్మించిన టీ-49 సొరంగం అత్యంత పొడవైనది. అలాగే, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 927 వంతెనలు సైతం ఉన్నాయి. వీటిలో చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన కూడా ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు.

Related Posts
Revanth Reddy : సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నెలకొన్న Read more

టీడీపీలో చేరుతున్న తీగ‌ల కృష్ణారెడ్డి
Teegala Krishna Reddy joining TDP

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది Read more

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌
Counting of MLC elections in Telugu states is ongoing

హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ను అధికారులు Read more

LRS : LRS రాయితీ గడువు పెంచే అవకాశం?
Telangana government key update on LRS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) లో 25% రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది. ప్రభుత్వం ఇచ్చిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×