Revanth Reddy : సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం తన దృష్టికి రాగానే హెచ్సీఏపై వచ్చే ఆరోపణలను పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ టిక్కెట్లు పాస్ల కేటాయింపు విషయంలో హెచ్సీఏ అనైతికంగా ప్రవర్తిస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు.హెచ్సీఏ అధికారులు ఉచిత టిక్కెట్ల కోసం ఒత్తిడి తీసుకువస్తున్నారనే ఆరోపణలతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధి హెచ్సీఏ కోశాధికారికి లేఖ రాశారు. ఇందులో హెచ్సీఏ తమపై బలవంతపు ఒత్తిడి తెస్తోందని ఇది నిరాశాజనకమని తెలిపారు. ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు 10 శాతం కాంప్లిమెంటరీ టిక్కెట్లు కేటాయించాలని, 50 సీట్ల సామర్థ్యం కలిగిన F12A కార్పొరేట్ బాక్స్ టిక్కెట్లు అందులో భాగమేనని లేఖలో పేర్కొన్నారు.

అయితే ఈ ఏడాది కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 సీట్లకు తగ్గించారని, మిగిలిన 20 టిక్కెట్లు అదనంగా కేటాయించాలని హెచ్సీఏ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సీఏ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసోసియేషన్లో అవకతవకలు జరిగాయని భావించి విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని లైట్గా తీసుకోవడం లేదు. ఈ సమస్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని స్పష్టంగా తెలియజేశారు. సన్ రైజర్స్ Hyderabad టీమ్కు అన్యాయం జరగకుండా, టిక్కెట్ల కేటాయింపు విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇకపై హెచ్సీఏ వ్యవహారాల్లో గందరగోళం చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.