Revanth Reddy సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య నెలకొన్న వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం తన దృష్టికి రాగానే హెచ్‌సీఏపై వచ్చే ఆరోపణలను పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ టిక్కెట్లు పాస్‌ల కేటాయింపు విషయంలో హెచ్‌సీఏ అనైతికంగా ప్రవర్తిస్తోందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు.హెచ్‌సీఏ అధికారులు ఉచిత టిక్కెట్ల కోసం ఒత్తిడి తీసుకువస్తున్నారనే ఆరోపణలతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధి హెచ్‌సీఏ కోశాధికారికి లేఖ రాశారు. ఇందులో హెచ్‌సీఏ తమపై బలవంతపు ఒత్తిడి తెస్తోందని ఇది నిరాశాజనకమని తెలిపారు. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం కాంప్లిమెంటరీ టిక్కెట్లు కేటాయించాలని, 50 సీట్ల సామర్థ్యం కలిగిన F12A కార్పొరేట్ బాక్స్ టిక్కెట్లు అందులో భాగమేనని లేఖలో పేర్కొన్నారు.

Advertisements
Revanth Reddy సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy సన్ రైజర్స్ పై స్పందించిన రేవంత్ రెడ్డి

అయితే ఈ ఏడాది కార్పొరేట్ బాక్స్ సామర్థ్యం 30 సీట్లకు తగ్గించారని, మిగిలిన 20 టిక్కెట్లు అదనంగా కేటాయించాలని హెచ్‌సీఏ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్‌సీఏ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసోసియేషన్‌లో అవకతవకలు జరిగాయని భావించి విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.హెచ్‌సీఏపై వస్తున్న ఆరోపణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని లైట్‌గా తీసుకోవడం లేదు. ఈ సమస్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని స్పష్టంగా తెలియజేశారు. సన్ రైజర్స్ Hyderabad టీమ్‌కు అన్యాయం జరగకుండా, టిక్కెట్ల కేటాయింపు విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాల్లో గందరగోళం చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.

Related Posts
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశాలు లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, "ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను Read more

Student: స్టేజీపైనే కుప్పకూలి మరణించిన విద్యార్థిని
Student: స్టేజీపైనే కుప్పకూలి మరణించిన విద్యార్థిని

విషాదం: కళాశాల ఫేర్‌వెల్ వేడుకలో విద్యార్థిని మృతి మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లాలో ఓ కాలేజీ ఫేర్‌వెల్ వేడుక విషాదంలోకి మారింది. స్నేహితులతో కలిసి నవ్వుతూ మాట్లాడిన ఆ Read more

జనసేనకి ఈసీ మరో శుభవార్త
జనసేనకి ఈసీ మరో శుభవార్త

జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త అందించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన, ఇప్పుడు తెలంగాణలోనూ అధికారిక గుర్తింపు పొందింది. Read more

Delimitation: డీలిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం: రేవంత్ రెడ్డి
తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ ను ప్రకటించి, డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్ర వైఖరి మారాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజక వర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ విధి విధానాలలో మార్పులు చేయాలని సూచించారు. శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ తీర్మానం శాసన సభలో డీ లిమిటేషన్ పై తీర్మానం ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు రాష్ట్రంలో శాసనసభ నియోజక వర్గాలను పెంచాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభాలెక్కలకు అనుగుణంగా SC, ST స్థానాలను పెంచాలనీ కేంద్రాన్ని ఆయన కోరారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లని విధంగా చేయాలని అభిప్రాయ పడ్డారు. నియోజక వర్గాల పెంపు పైన చర్చ దక్షిణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ తో నష్టం కేంద్ర ప్రభుత్వంతో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, నియోజక వర్గాల పెంపు పైన చర్చ జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా నష్టపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదు గతంలో ఇందిరాగాంధీ ఆమోదించలేదన్న సీఎం రేవంత్ గతంలో ఇందిరా గాంధీ కూడా డీలిమిటేషన్ కు అంగీకరించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇక తాజాగా మరోమారు నియోజకవర్గాలు పునర్విభజన అంశం తెర మీదికి రావడంతో దక్షిణాది రాష్ట్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే ఖచ్చితంగా అందరితో కలిసి కేంద్రానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కడ్బందీగా కుటుంబ నియంత్రణ అమలు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై రేవంత్ ఆందోళన దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేశాయని, ఫలితంగా రాష్ట్రాలకు నష్టం జరిగితే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వ విధానాన్ని సమగ్రంగా అమలు చేసినందుకు తమకే బెనిఫిట్ జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చట్టసభలలో 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్ విషయంలో రేవంత్ డిమాండ్ ఇదే డీలిమిటేషన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని శాసన సభ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను మాత్రమే కొనసాగించాలని ఆయన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని డిమాండ్ చేశారు.

తెలంగాణా రాష్ట్ర శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసన సభలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక తీర్మానం చేశారు. ఈ తీర్మానం ద్వారా తెలంగాణా ప్రభుత్వ స్టాండ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×