nirmala

ఛాట్ జీపీటీ, డీప్ సీక్ వాడకాన్ని ఆపాలి: కేంద్రం

ఛాట్ జీపీటీ, డీప్ సీక్, గూగుల్ జెమిని వంటి విదేశీ AI యాప్‌ల వినియోగం భారతదేశంలో వేగంగా పెరుగుతోంది. వినియోగదారులు తమ పనిని సులభంగా, వేగంగా పూర్తిచేయడానికి ఈ యాప్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఏఐ టూల్స్ వినియోగించే సమయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించి అందరి మదిలో అనేక రకాల ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఏఐ యాప్స్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా వినియోగదారులు తమ పరికరాల్లో డేటాకు యాక్సెస్‌ను తప్పక అనుమతించాల్సిందే. ఇది ఏఐ టెక్నాలజీ యాప్స్ వాడేవారి వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. జాతీయ భద్రత, సున్నితమైన, గోప్యమైన సమాచారానికి హాని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే తమ ఉద్యోగులు ఛాట్ జీపీటీ, డీప్ సీక్ ఇక మీదట వాడకూడదని కఠిన ఆంక్షలు విధించింది కేంద్ర ఆర్థికశాఖ.

అధికారిక పనుల కోసం అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై AI సాధనాలను ఉపయోగించటం మానుకోవాలని ఆపాలని కేంద్ర ఆర్థికశాఖ ఆదేశించినట్లు పలు జాతీయ మీడియా కథానాలు పేర్కొంటున్నాయి. ఇక ఇప్పటికే భారత ప్రభుత్వం సొంత ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవలే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు చైనాకు చెందిన డీప్ సీక్ వాడకంపై నిషేధాజ్ఞలు జారీ చేశాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వాడుతున్న ఏఐ యాప్‌లు డేటా భద్రతకు, గోప్యతకు భంగం కలిగించవచ్చనే భయాందోళనే అందుకు ప్రధాన కారణం.

Related Posts
అదానీ పై కుట్ర చేస్తోంది ఎవరు?
adani

దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీపై ఆర్థికపరమైన దాడి చేయడానికి హిండెన్‌బర్గ్‌‌ను నియమించుకున్న అమెరికన్ చైనీస్ ఇన్వెస్టర్/చైనీస్ గూఢచార్యం ఇటీవలే Read more

ట్రంప్ ప్రమాణ స్వీకారం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్
stock market

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం మాటేంటో గానీ భారత్‌కు మాత్రం కలిసి రానట్టే కనిపిస్తోంది. ఆయన బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే Read more

రాజస్థాన్ కోటాలో కొత్త నిబంధనలు
రాజస్థాన్ కోటాలో కొత్త నిబంధనలు

కోటా జిల్లాలో కొత్త మార్గదర్శకాలు: ఆత్మహత్యలు నివారించేందుకు కీలక నిర్ణయాలు రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా జిల్లా, విద్యార్థుల కోచింగ్ పరీక్షల కోసం ప్రసిద్దమైన ప్రాంతంగా సురక్షితమైన. కోచింగ్ Read more

అతిశీ సహా ఆ ఇద్దరు కార్యకర్తలపై కేసు నమోదు!

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రోజు ఎన్నికలు జరగబోతుండగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీకి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదు Read more