స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన వినూత్న సినిమా “ఉప్పు కప్పురంబు” ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐవీ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక సెటైరికల్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది. రాధికా ఎల్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు సుహాస్ (Suhas) కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా జూలై 4న నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్రసారం కానుంది. ఈ చిత్రం తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
ట్రైలర్ విశేషాలు
ట్రైలర్ను పరిశీలిస్తే, గ్రామ పంచాయతీ పెద్ద చనిపోవడంతో కీర్తి సురేష్ పాత్రను గ్రామ పెద్దగా నియమిస్తారు. ఆమె పాత్ర అమాయకురాలు, కానీ ఓపిక, నమ్మకంతో ఊరి బాధ్యతలు తీసుకుంటుంది. అయితే ఊరిలో ఓ వింత సంక్షోభం మొదలవుతుంది. గ్రామంలోని స్మశానవాటికలో చోటు సరిపోకపోవడం కారణంగా చనిపోయినవారిని పూడ్చిపెట్టే స్థలం కరువవుతుంది.స్మశానం పూర్తిగా “హౌస్ఫుల్” (“Housefull”) అయిపోతుంది. ట్రైలర్ ఆరంభం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక మిగిలిన స్థలంలో కేవలం నలుగురి పూడ్చడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.ఈ సంక్షోభాన్ని గ్రామస్తులు ఎలా ఎదుర్కొన్నారు? అమాయకురాలైన నాయకురాలు అయిన కీర్తి సురేష్ ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించింది? అన్నదే సినిమా కథ.వసంత్ మురళీకృష్ణ మళింగంటి ఈ సినిమాకు కథను అందించారు.
నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం
ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ మళింగంటి కథను అందించగా, దర్శకుడు ఐవీ శశి దానికి స్క్రీన్ప్లే రూపం ఇచ్చారు. సినిమా నేపథ్యం వినూత్నంగా ఉండటంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సినిమా ప్రయత్నంగా నిలవనుంది. సుహాస్ పాత్ర కూడా ట్రైలర్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కనిపించింది. కీర్తి సురేష్ (Keerthy Suresh) తన గత సినిమాలు చూస్తే, ఈ చిత్రంలో పూర్తి సరికొత్త క్యారెక్టర్ను పోషిస్తోంది. ఓ సింపుల్ గ్రామ యువతిగా, నాయకురాలిగా మారే ఈ పాత్రలో ఉన్న భావోద్వేగాలు, వినోదం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.ప్రస్తుతం టాలీవుడ్లో వినూత్న కథలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో “ఉప్పు కప్పురంబు” సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.ఈ సినిమా ఓ మంచి సందేశాన్ని కూడా ఇవ్వబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
Read Also: Genelia Deshmukh : సౌత్ ఇండస్ట్రీ నా కెరీర్ను మార్చేసిందన్న జెనీలియా