Tunnel accident.. Engineer Gurpreet Singh body identified!

టన్నెల్ ఘటన..ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం గుర్తింపు !

హైదరాబాద్‌ : 16 రోజుల ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక అప్డేట్ వచ్చేసింది. టీబీఎం మెషీన్ ముందు భాగంలో మృతదేహాం ఆనవాళ్లు కనుగొనింది రెస్క్యూ టీం. కుడి చెయ్యి, ఎడమ కాలు భాగాలను గుర్తించారు రెస్క్యూ టీం. చేతికి కడియం ఉండడంతో ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ మృతదేహంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకి తీసే అవకాశం ఉంది. దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్‌లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు.

Advertisements
image

టన్నెల్ మెుత్తం పొడవు 14కి.మీ

ఇక అటు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ముక్క‌లు ముక్క‌లుగా టీబీఎం మిష‌న్‌ వస్తోంది. మిష‌న్‌ను క‌ట్టర్‌తో క‌ట్ చేశాయి రెస్క్యూ టీమ్స్‌. మిష‌న్ పార్ట్‌ల‌ను బ‌య‌ట‌కు పంపిస్తున్నారు స‌హాయ‌కులు. ఈ ప్ర‌క్రియ పూర్తియితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఛాన్సు ఉంది. టన్నెల్ మెుత్తం పొడవు 14కి.మీ కాగా.. 13.950 మీటర్ల వరకు క్లియర్‌గా ఉందన్నారు. జీరో పాయింట్ వద్ద చివరి 50 మీటర్లు సంక్లిష్టంగా ఉందని చెప్పారు. చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసేవారికి కూడా ప్రమాదమేనని అన్నారు.

మరోసారి ప్రమాద ఘటన, సహాయక చర్యలపై రివ్యూ

కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒకచోట ముగ్గురు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. రెస్క్యూలో భాగంగా రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామన్నారు. ఈనెల 11న ముఖ్యమంత్రి స్థాయిలో మరోసారి ప్రమాద ఘటన, సహాయక చర్యలపై రివ్యూ ఉంటుందని చెప్పారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంది. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. అయితే ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కాసేపట్లో పూర్తి స్థాయి అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts
Bomb Threat : విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్
Rajasthan ,mumbai indigo fl

రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. విమాన ప్రయాణ మధ్యలో ఈ సమాచారం Read more

Show Time : ‘షో టైమ్’ ఫస్ట్ లుక్ రిలీజ్
show time

Show Time : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ జంటగా నటించిన మూవీ ‘షో టైమ్’. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై Read more

చరిత్రలో నిలిచిపోయే రోజు..ఈరోజు – సీఎం రేవంత్
telangana thalli cm revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను 'టీజీ'గా మార్చామని , ఈ Read more

Tahawwur Rana: భారీ భద్రత మధ్య ఢిల్లీ కి చేరుకోనున్న ముంబై ఉగ్రవాది హై-సెక్యూరిటీ ఏర్పాటు
Tahawwur Rana: భారీ భద్రత మధ్య ఢిల్లీ కి చేరుకోనున్న ముంబై ఉగ్రవాది హై-సెక్యూరిటీ ఏర్పాటు

ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన భయంకరమైన ఉగ్రదాడులను భారతదేశ చరిత్రలో ఎవరు మరిచిపోలేరు. పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు Read more

Advertisements
×