ఇటీవల తిరుమలలో చిరుతల సంచారం తీవ్రమైంది. రెండు వారాల క్రితమే అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను భయబ్రాంతులకు గురిచేసేలా చిరుత సంచరించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ క్రమంలో భక్తుల రక్షణ కోసం టీటీడీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు.
భక్తుల రక్షణ కోసం టీటీడీ అధికారి చర్యలు
భక్తుల భద్రతే మేము అధిక ప్రాధాన్యమిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. గతంలో జరిగిన సంచార సంఘటనల నేపథ్యంలో తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయం వద్ద బోన్లు ఏర్పాటు చేసి, చిరుతను పట్టు పట్టే ప్రయత్నం జరిగింది. ఆనాటి ప్రయత్నంలో ఓ చిరుత బోనులో చిక్కిపోవడంతో ఆ సమయంలో భక్తులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
మరోసారి చిరుత సంచారం
తాజాగా మరోసారి తిరుమల జూపార్క్ రోడ్ ప్రాంతం నుంచి తిరుమల టోల్ గేట్ వరకు చిరుత సంచరించినట్లు గుర్తించారు. అటవీ ప్రాంతంలోకి చిరుత దూసుకెళ్తుండటాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మళ్లీ భక్తుల్లో భయం మళ్లె మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో చిరుతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సెల్ను తిరుమల అటవీ మ్యూజియం భవనంలోనే ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా శాటిలైట్ ట్రాకింగ్, అధునాతన కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్లు ఉపయోగించి చిరుతల గమనాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నారు.
Read also: YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో రంగన్న భార్యకు సిట్ నోటీసులు