telangana thalli cm revanth

చరిత్రలో నిలిచిపోయే రోజు..ఈరోజు – సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను ‘టీజీ’గా మార్చామని , ఈ నిర్ణయం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనేక సంవత్సరాలు అవహేళనకు గురయ్యాయని, తాజాగా ఈ మార్పు ద్వారా ప్రజల అంగీకారం సాధించినట్టు తెలిపారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో ‘టీజీ’ అని రాసుకోవడం సాధారణమైన పద్ధతిగా మారిందని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ‘టీఎస్’ అని వాడకంతో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు ఆయన విమర్శించారు. ఈ మార్పు ప్రజల మనోభావాలను అంగీకరించే ప్రయత్నమని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి గౌరవం దక్కకపోవడం పై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఈ గీతాన్ని రాష్ట్ర గీతగా ప్రకటించడం ద్వారా తెలంగాణ సంస్కృతికి గౌరవం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ పదేళ్లపాటు వివక్షకు గురైన రాష్ట్రమని చెప్పారు. ఉద్యమం సమయంలో కవులు, కళాకారులు ఎప్పుడూ తమ సాహిత్యం, కళల ద్వారా ఉద్యమానికి ఊపిరినిచ్చారని, వారికి గుర్తింపు ఇవ్వడం అవసరం అని పేర్కొన్నారు. తాము సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ మార్గంలో నడిపిస్తున్నామని, ప్రజల అభ్యర్థనలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Related Posts
బీజేపీ సభలో జేబుదొంగల బీబత్సం
midhun chakravarthi

ప్రముఖ సినీ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోచేదు అనుభవం ఎదురైంది. నిర్సా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరఫున మిథున్ చక్రవర్తి Read more

శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..

సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయనతో పాటు నిర్మాత దిల్ Read more

సీఎంఆర్ చెల్లింపుల గడువు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
11

హైదరాబాద్‌: సీఎం రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైస్ మిల్లులు ప్రభుత్వానికి చెల్లించే సీఎంఆర్‌ బకాయిల గడువు తేదీని మరో 3 నెలల Read more

తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐఐఎంసి
తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐఐఎంసి

వివరాల్లోకి వెళ్ళగా ఈ కార్యక్రమంలో ఆచార్య ఎస్వీ రామారావు రచించిన 'శత జయంతి సాహితీ మూర్తులు' పుస్తకావిష్కరణ జరిగింది. యువ భారతి సాంస్కృతిక సంస్థ మరియు నవ్య Read more