Tragedy in Madhya Pradesh.. 8 people die after inhaling toxic gases!

Toxic gas : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విషాదం.. విష వాయువుల‌ను పీల్చి 8 మంది మృతి!

Toxic gas : మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బావిలో విషవాయువు పీల్చి 8 మంది మృతి చెందారు. ఖాండ్వా జిల్లాలో జిల్లాలోని చైగావ్ మఖాన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏటా గంగోర్ పండుగ సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు బావులను శుభ్రం చేస్తారు. ఈ క్రమంలోనే చైగావ్ మఖాన్ ప్రాంతంలో పలువురు వ్యక్తులు కలిసి ఓ బావిని శుభ్రం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో మొదట ఓ వ్యక్తి బావిలోకి దిగగా శ్వాస సరిగా ఆడకపోవడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయనను కాపాడటానికి మరో ఏడుగురు బావిలోకి దిగారు.

Advertisements
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో విషాదం విష వాయువుల‌ను

విషవాయువు వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని

అయితే వారంతా ఎంతకూ బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా బావిలోనే మృతి చెంది కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. బావి నుంచి వెలువడే విషవాయువు వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మృతులను రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35), మోహన్ పటేల్ (53) గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా

ఇక, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ తీవ్ర విషాదం నేప‌థ్యంలో గ్రామస్తులు… భవిష్యత్తులో మ‌రోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి బావిని మూసివేయాలని నిర్ణయించారు.

Related Posts
రేవంత్‌ గాలి మాటలకు జవాబు చెప్పాలా? : కిషన్ రెడ్డి
Kishan Reddy comments on cm revanth reddy

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా Read more

ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!
school holidays in august

Dussehra holidays in AP from 3rd of this month! అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా Read more

AI, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ: NSDC
AI, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ: NSDC

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ఏర్పాటుచేసిన స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ (SIDH) AI, డ్రోన్ టెక్నాలజీ, డేటా సైన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్‌లోని కోర్సుల Read more

రేపు కందుకూరులో సీఎంచంద్రబాబు పర్యటన
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

రేపు కందుకూరులో సీఎంచంద్రబాబు పర్యటనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమం భాగంగా ఆయన ఈ పర్యటన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×