కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిన రోజుల్లో.. హైదరాబాద్లో ఒక చిన్న ఆలోచన పెద్ద కలగా మారింది. అదే Skyroot Aerospace (Skyroot Aerospace). భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఈ స్టార్టప్ కంపెనీ.. ఇప్పుడు తన విలువను సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు 8 వేల కోట్లకు పైగా) స్థాయికి తీసుకెళ్లే దిశగా దూసుకెళ్తోంది. ఇది సాధ్యమైతే Skyroot భారత్లోనే తొలి స్పేస్-టెక్ యూనికోర్న్గా చరిత్ర సృష్టించనుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసం, ఆధునిక సాంకేతికత, కేంద్ర ప్రభుత్వ విధాన మార్పులు అన్నీ కలిసి ఈ ప్రయాణానికి బలం చేకూరుస్తున్నాయి. Skyroot Aerospaceను 2018లో స్థాపించిన వారు ఇద్దరూ ISROలో పని చేసిన అనుభవజ్ఞులైన ఇంజనీర్లు. రాకెట్ ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ డిజైన్లో పట్టు సాధించిన ఈ వ్యవస్థాపకులు, భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు.
Read Also: Rajyasabha: రాజ్యసభ ఎన్నికల్లో NDAదే పైచేయి?

తొలి సంస్థల్లో Skyroot ఒకటి
2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం స్పేస్ స్టార్టప్లకు గేమ్చేంజర్గా మారింది. ISROకు చెందిన లాంచ్ప్యాడ్లు, టెస్టింగ్ సదుపాయాలను ప్రైవేట్ సంస్థలు కూడా వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న తొలి సంస్థల్లో Skyroot ఒకటి. ఇది కంపెనీకి సాంకేతికంగా మాత్రమే కాకుండా, విశ్వసనీయత పరంగా కూడా పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది. Skyroot రూపొందించిన రాకెట్లకు భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయి పేరును పెట్టారు. 2022లో ప్రయోగించిన విక్రమ్-S రాకెట్ భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి రాకెట్గా నిలిచింది. ఇది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు, భారత స్పేస్ రంగంలో కొత్త యుగానికి నాంది పలికిన ఘట్టం. ప్రస్తుతం Skyroot విక్రమ్-I అనే ఆర్బిటల్ రాకెట్పై పనిచేస్తోంది.
స్వదేశీ టెక్నాలజీతో రాకెట్లను అభివృద్ధి
ఈ పెట్టుబడులు లభిస్తే.. కంపెనీ విలువ నేరుగా 1 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు కంపెనీపై ఆసక్తి చూపడం Skyroot భవిష్యత్తుపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భారత్లో ఏర్పడిన 300కి పైగా స్పేస్ స్టార్టప్లలో Skyroot ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్వదేశీ టెక్నాలజీతో రాకెట్లను అభివృద్ధి చేయడం వల్ల, భారతదేశం అంతరిక్ష రంగంలో మరింత స్వయం ఆధారితంగా మారుతోంది. ఇది గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్కు కొత్త గుర్తింపును తెస్తోంది. Skyroot లక్ష్యం కేవలం యూనికోర్న్గా మారడమే కాదు. ప్రపంచ స్థాయిలో తక్కువ ఖర్చుతో, వేగవంతమైన ఉపగ్రహ ప్రయోగ సేవలను అందించే సంస్థగా ఎదగాలని చూస్తోంది. రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీపై కూడా పరిశోధనలు జరుగుతుండటం, భవిష్యత్తులో ఖర్చులను మరింత తగ్గించగలదనే ఆశను పెంచుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: