Akshay Kumar: కేసరి 2 మూవీ లోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి:అక్ష‌య్ కుమార్

Read Time:  1 min
Akshay Kumar: కేసరి 2 మూవీ లోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి:అక్ష‌య్ కుమార్
FONT SIZE
GET APP

నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కేస‌రి చాప్టర్ 2’. ఈ సినిమా జలియన్ వాలాబాగ్ ఘటన ఆధారంగా రూపొందుతోంది. ‘అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌ వాలాబాగ్‌’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రానికి కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మాధవన్, రెజీనా కసాండ్రా, అనన్య పాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.ఈరోజు విడుదల కానుంది కేస‌రి చాప్టర్ 2 మూవీ.ఈ సినిమా చూడటానికి వచ్చే వారందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే ద‌య‌చేసి ‘కేసరి 2’ ఇంట్రో మిస్ అవ్వ‌కండి.ఈ సినిమాలోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి. మీ కెమెరా ద్వారా ఇది ప్రతి ఒక్కరికీ చేరుతుందని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా చూడాలని నిర్ణయించుకున్నవారు ఆలస్యంగా రాకూడదని తెలుసుకోవాలి. సరైన సమయంలో రావాలి. ఈ సినిమా యొక్క క‌థ ఆ 10 నిమిషాలు నుంచే ప్రారంభమవుతుందంటూ అక్ష‌య్ చెప్పుకోచ్చాడు.

జలియన్ వాలాబాగ్

వేలాది మంది ప్ర‌జ‌లు 1919 ఏప్రిల్ 13న అమృతసర్‌లోని జలియన్ వాలాబాగ్‌‌కు చేరుకున్నారు. ఇదే ఉత్సవాల్లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన‌ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం పాల్గొన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ, సత్యాపాల్‌ను అరెస్ట్ చేసి, దేశ బహిష్కరణ విధించడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. పంజాబ్‌లో యుద్ధ చట్టాన్ని అమలు చేసి, శాంతిభద్రతల బాధ్యతను బ్రిగేడియర్ జనరల్ డయ్యర్‌కు అప్పగించింది. ఆందోళ‌న‌లు ఇంకా ఆగలేదు.రౌలత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, త‌మ‌ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 13 న అమృత్సర్‌లోని జలియన్ వాలా బాగ్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 25 నుంచి 30 వేల మంది హాజరయ్యారు. జనరల్ డయ్యర్ తన దళాలతో అక్కడికి వచ్చి నిరాయుధ ప్రజలపై కాల్పులు జ‌రుపుతానంటూ బెదిరించాడు. దాంతో అక్క‌డ‌ గందరగోళం నెలకొన్న‌ది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవ‌టానికి పరుగెత్తటం ప్రారంభించారు. చాలా మంది తోటలోని బావిలోకి దూకారు. కాల్పులు సుమారు 10 నిమిషాలు కొనసాగాయి. ఇందులో వేయికి పైగా జ‌నం మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.

 Akshay Kumar: కేసరి 2  మూవీ లోని మొదటి 10 నిమిషాలు చాలా ముఖ్యమైనవి:అక్ష‌య్ కుమార్

గుస్​బంప్స్

ఇక ట్రైలర్ చూస్తే 3 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో ఆకట్టుకుంది. ఒక్కో సన్నివేశం గుస్​బంప్స్ తెప్పిస్తోంది. కోర్టులో మాధవన్‌– అక్షయ్‌ కుమార్ మధ్య సంభాషణలు, వీడియో ప్రారంభంలో డైలాగులు ట్రైలర్​లో హైలైట్​గా నిలుస్తున్నాయి.

Read Also: Sampath Nandi: ఓదెల-2 సినిమాపై మేము పెట్టుకున్న అంచనాలన్నీ నిజమయ్యాయి: సంపత్‌నంది

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.