కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.సంబంధం లేని వారు ఆ భూముల్లోకి అడుగుపెట్టకూడదని హెచ్చరించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.ఈ వివాదాస్పద భూములు రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి మండలంలోని సర్వే నం.25లో ఉన్నాయి.దాదాపు 400 ఎకరాల భూమి ఈ వివాదానికి కేంద్రబిందువైంది.ఇక్కడ ఎవరు అడ్డుగా రాకూడదని అధికారులు తెగ చెప్పేశారు.భూముల్లోకి వెళ్లే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

భూమి వివాదం తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది.అయితే, ఒక్క రోజులోనే 100 ఎకరాల్లో చెట్లు నరికేసిన ఘటనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇంకా నిర్ణయం రాకముందే ఇలా ఎలా చేయగలిగారు? అంటూ కోర్టు ప్రశ్నించింది.ఈ స్థలంలో ఏ పనులు చేయకూడదని సుప్రీం తేల్చిచెప్పింది.ఇది చట్ట విరుద్ధమని కోర్టు హెచ్చరించింది.ప్రస్తుతం పోలీసుల హెచ్చరికలతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.