తెలంగాణ రైతులకు రైతు భరోసాపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం సచివాలయంలో సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలపై సబ్ కమిటీ చర్చించనుంది. రైతు భరోసాపై నివేదికను తయారుచేసి ఈనెల 4న కేబినెట్ ముందు సబ్ కమిటీ ఉంచనుంది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసాపై వేగంగా అడుగులు తీసుకునే ఉద్యోగస్తులకు, ప్రజా ప్రతినిధులకు, ఐటీ పేయర్స్కు రైతు భరోసాపై సబ్ కమిటీ చర్చించనుంది.

సంక్రాంతి పండుగ నుంచి భరోసా
సంక్రాంతి పండుగ నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.7500ల చొప్పున రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైంది. రైతు భరోసాకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి సారించిన సర్కార్.. కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సబ్ కమిటీని నియమించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు , ఐటీ పేయర్స్ ఏలాంటి నిర్ణయం తీసుకోవాలి, రైతులకు ఎంత భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలా? లేదంటే ఇన్ని ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అంటూ కటాఫ్ పెట్టాలా అనే దానిపై సర్కార్ తర్జభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
4న తెలంగాణ కేబినెట్ సమావేశం
సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్ విషయంలో సబ్ కమిటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈనెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశం లోపు రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేసి అందజేస్తే.. సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే దానిపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతుల వేదికల ద్వారా సమావేశాలు పెట్టి గ్రామస్థాయి నుంచి రిపోర్టులను ప్రభుత్వానికి అందజేశారు అధికారులు. వాటి ఆధారంగా రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మొత్తానికి సంక్రాంతికి రైతుల ఖాతాలో ఎకరాకి రూ.7500 రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.