హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో దివ్యాంగుల పెన్షన్ (Pension) రూ.6వేలు కచ్చితంగా పెంచుతామని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ఈమేరకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో స్థానిక సంస్థల్లో దివ్యాంగుల రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ‘దివ్యాంగుల హక్కులు సంక్షేమం, రాజకీయ అవకాశాలు‘ పై రాష్ట్ర సదస్సు జరిగింది. చైర్మన్ వీరయ్య ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచకొంటే తాను పదవికి రాజీనామా చేస్తానని… కేంద్రం రూ.3వేలకు పెన్షన్ పెంచకొంటే తమరు పార్టీ పదవికి రాజీనామా (Resignation from party position) చేసే దమ్ముందా అని బిజెపి (BJP) నేతలకు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం 80 శాతం పైబడి అంగవైకల్యం ఉంటేనే దివ్యాంగులగా గుర్తించి, 20 వేల మందికి నెలకు రూ.300 చొప్పున పెన్షన్ ఇస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం 40శాతం పైబడి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు నెలకు రూ.4,016 పెన్షన్ ఇస్తున్నదని తెలిపారు. సమావేశంలో కమిటీ చైర్మన్ షఫీ, వైస్ చైర్మన్ ధ్యనంపల్లిమల్లికార్జున్, ఎన్పీఆర్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు తుడుం రాజేందర్తోపాటు వివిధ జిల్లాల నుంచి 150 మంది దివ్యాంగులు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :