हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

News telugu: Hyderabad-ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల – మూసీ ఉధృతి పెంపు

Sharanya
News telugu: Hyderabad-ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటి విడుదల – మూసీ ఉధృతి పెంపు

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో, అధికారులు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌(Himayat Sagar) లోకి గణనీయంగా వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయాల గేట్లు ఎత్తి, నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం మూసారాంబాగ్, చాదర్ ఘాట్, పురానాపూల్ వంటి ప్రాంతాల్లో నదిని ఉద్ధృతంగా ముంచేస్తోంది.

News telugu
News telugu

బ్రిడ్జిపై నీటి ప్రవాహం: ట్రాఫిక్ మళ్లింపు

ఉస్మాన్ సాగర్ (Usman Sagar)నుంచి విడుదల చేసిన నీటి ప్రభావంతో మూసారాంబాగ్ బ్రిడ్జి రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. దిల్‌సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నారు.

నగరవాసులకి తీవ్ర ఇబ్బందులు

భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బేగంబజార్, కోఠి, నాంపల్లి, హిమయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వారు, బయట పనులకెళ్లినవారు తడిసిముద్దయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870