TG Summit: తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025(Telangana Rising Global Summit–2025)’ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభారంభం చేశారు.
Read also: Visakhapatnam Port: విశాఖ పోర్టు రికార్డు
ఉద్వాటన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నటుడు నాగార్జునతో పాటు దేశ–విదేశాల నుంచి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మరియు పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈవెంట్లో అతిథులను రోబో ద్వారా స్వాగతించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పెట్టుబడిదారుల సన్నాహంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2025
100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్ రెండు రోజుల పాటు జరుగనుంది. మొత్తం 44 దేశాల నుంచి వచ్చిన 154 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కార్యక్రమానికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాంగణాన్ని సందర్శించి స్టాల్స్ను పరిశీలించారు. వివిధ విభాగాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
డిజిటల్ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో సదస్సు ఆకర్షణ
సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో పరిపాలనలో జరుగుతున్న సంస్కరణలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, ‘విజన్ 2047’ లక్ష్యాలు, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికపై ముఖ్యమంత్రి ఈ సభలో వివరణ ఇవ్వనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: