हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Pensions: చనిపోయిన వారికి ‘చేయూత’ పెన్షన్లు! రికవరీకి ఆదేశించిన సర్కార్

Ramya
TG Pensions: చనిపోయిన వారికి ‘చేయూత’ పెన్షన్లు! రికవరీకి ఆదేశించిన సర్కార్

హైదరాబాద్ : ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పెన్షన్లు పక్కదారి పడుతున్నాయి. ఈ పెన్షన్లు పొందుతున్న వారు మరణించినప్పటికీ వారికి పెన్షన్లు (TG Pensions) వెళుతున్నాయి. వాస్తవానికి వారు మరణించడంతో ఆరా తీసిన ప్రభుత్వం ఆ పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. చనిపోయిన వారికి మంజూరు చేసిన పింఛన్లను రికవరీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ (Govt issued orders) చేసింది. సంవత్సర క్రితం చనిపోయిన పింఛను దారులకు కూడా చేయూత పెన్షన్లు (Pensions) అందజేశారు. ఈ క్రమంలో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇలా 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) తాజాగా గుర్తించింది. చేయూత పింఛన్లు (TG Pensions) అందుకుంటూ మరణించిన పలు విభాగాల లబ్దిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేయలేదు. అందువల్లే ఈ సమస్య ఎదురైందని, అధికారులు తెలిపారు.

Pensions
Pensions

28 వేల మంది ఫించన్లు రికవరీ

ఈ లబ్దిదారుల్లో కొందరికి నెలకు రూ.2,016, దివ్యాంగులకు నెలకు 4,016 రూపాయల చొప్పున సంవత్సర కాలం పాటు ప్రతి నెల వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో.. సదరు పింఛన్దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరణించిన లబ్దిదారులు పేరు మీద జమ అయిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులు.. చనిపోయిన వారి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి.. ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతోపాటుగా మరణించిన 28 వేల మంది పింఛనుదారుల పేర్లను జాబితా నుంచి తొలగించిన్లుగా అధికారులు ప్రకటించారు. అలానే వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి.. మరణించిన వారి భార్య లేదా భర్తకు పెన్షన్ అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పింఛన్ల జారీలో మోసాలను అరికట్టడానికి.. సమస్యలను తొలగించడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెల అనగా జులై 29 నుంచి జూలై పింఛన్ పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫేషియల్ రికగ్నిషన్ (Facial recognition) విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. పెన్షన్ లబ్దిదారుల్లో కొందరికి వేలిముద్రలు సరిగా లేకపోవడంతో పాటుగా మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో భాగంగా పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే 23 లక్షల మందికి ఈ విధానాన్ని వర్తింపచేయనున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్, కొత్త స్మార్ట్ఫోన్లు, సిబ్బందికి శిక్షణ వంటి పనులు పూర్తి చేశారు. ఈ కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం చేయూత పెన్షన్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంది?

మరణించిన లబ్దిదారులకు చెల్లించిన రూ.60 కోట్ల చేయూత పెన్షన్లను రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కొత్తగా ఏ విధానాన్ని అమలు చేస్తున్నారు?

జూలై 29 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానంతో పెన్షన్ పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/bc-welfare-association-reservations-should-be-provided-to-bcs-in-the-legislatures/telangana/526670/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870