తెలంగాణలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మేడారం మహా జాతర ముగిసిన వెంటనే హుండీల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ లెక్కింపును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి ఈ.కృష్ణప్రసాద్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, మేడారం ఈవో వీరస్వామి పర్యవేక్షించారు. ఈసారి జాతరలో మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేయగా, తొలి రోజు 125 హుండీల లెక్కింపు పూర్తయింది. అధికారులు చెప్పిన ప్రకారం, మొత్తం లెక్కింపుకు దాదాపు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. లెక్కింపు పూర్తయ్యాకే మొత్తం ఆదాయం ఎంత వచ్చిందో అధికారికంగా ప్రకటించనున్నారు.
Read also: ACB Raids Hyderabad: కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి

Medaram Jatara donation box counting… How much was the income
హుండీల్లో డబ్బులతో పాటు లేఖలు, వినతులు
మేడారం హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు మాత్రమే కాకుండా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. అంతేకాదు, రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు కూడా కనిపించడం విశేషం. అయితే ఈసారి హుండీల్లో కనిపించిన అత్యంత ఆసక్తికర అంశం భక్తుల లేఖలు. ప్రేమ, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం సమ్మక్క–సారలమ్మలను వేడుకుంటూ రాసిన లేఖలు అధికారులు దృష్టిని ఆకర్షించాయి. తొలి రోజు లెక్కించిన 125 హుండీల ద్వారా రూ.2 కోట్ల 49 లక్షల 65 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఇంకా 703 హుండీల లెక్కింపు కొనసాగాల్సి ఉంది.
ఆదాయ పంపిణీ, గద్దెల వద్ద జరిగిన మార్పులు
మేడారం జాతర హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతం వాటాను పూజారులకు అందజేస్తారు. గత జాతరలో సుమారు రూ.13 కోట్ల ఆదాయం రాగా, ఈసారి దాని కంటే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాకారం వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టడంతో రెండు రాతి దిమ్మెలు కదిలిపోయాయి. ఈ విషయం మీడియాలో రావడంతో, గద్దెల రూపకల్పన చేసిన డాక్టర్ మైపతి అరుణ్కుమార్ బృందం మేడారం చేరుకుని వాటిని తిరిగి అదే స్థానంలో అమర్చి భద్రపరిచారు. ప్రస్తుతం గద్దెల ప్రాంతం పూర్తిగా సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: