हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

TG: మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

Rajitha
TG: మేడారం జాతర హుండీ లెక్కింపు.. ఆదాయం ఎంతంటే?

తెలంగాణలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మేడారం మహా జాతర ముగిసిన వెంటనే హుండీల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈ లెక్కింపును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక అధికారి ఈ.కృష్ణప్రసాద్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, మేడారం ఈవో వీరస్వామి పర్యవేక్షించారు. ఈసారి జాతరలో మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేయగా, తొలి రోజు 125 హుండీల లెక్కింపు పూర్తయింది. అధికారులు చెప్పిన ప్రకారం, మొత్తం లెక్కింపుకు దాదాపు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. లెక్కింపు పూర్తయ్యాకే మొత్తం ఆదాయం ఎంత వచ్చిందో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read also: ACB Raids Hyderabad: కాసులిస్తేనే సరి .. లేదంటే కిరికిరి

Medaram

Medaram Jatara donation box counting… How much was the income

హుండీల్లో డబ్బులతో పాటు లేఖలు, వినతులు

మేడారం హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు మాత్రమే కాకుండా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. అంతేకాదు, రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు కూడా కనిపించడం విశేషం. అయితే ఈసారి హుండీల్లో కనిపించిన అత్యంత ఆసక్తికర అంశం భక్తుల లేఖలు. ప్రేమ, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం సమ్మక్క–సారలమ్మలను వేడుకుంటూ రాసిన లేఖలు అధికారులు దృష్టిని ఆకర్షించాయి. తొలి రోజు లెక్కించిన 125 హుండీల ద్వారా రూ.2 కోట్ల 49 లక్షల 65 వేల రూపాయల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. ఇంకా 703 హుండీల లెక్కింపు కొనసాగాల్సి ఉంది.

ఆదాయ పంపిణీ, గద్దెల వద్ద జరిగిన మార్పులు

మేడారం జాతర హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 33 శాతం వాటాను పూజారులకు అందజేస్తారు. గత జాతరలో సుమారు రూ.13 కోట్ల ఆదాయం రాగా, ఈసారి దాని కంటే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాకారం వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టడంతో రెండు రాతి దిమ్మెలు కదిలిపోయాయి. ఈ విషయం మీడియాలో రావడంతో, గద్దెల రూపకల్పన చేసిన డాక్టర్ మైపతి అరుణ్‌కుమార్ బృందం మేడారం చేరుకుని వాటిని తిరిగి అదే స్థానంలో అమర్చి భద్రపరిచారు. ప్రస్తుతం గద్దెల ప్రాంతం పూర్తిగా సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది: పవన్ కల్యాణ్‌

ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది: పవన్ కల్యాణ్‌

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ

జర్నలిస్టులకు శుభవార్త.. 9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ

జగన్ పర్యటన.. పలువురు నేతలపై కేసులు

జగన్ పర్యటన.. పలువురు నేతలపై కేసులు

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

త్వరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

NIT ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

అతి త్వరలో కొత్త పార్టీ

అతి త్వరలో కొత్త పార్టీ

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870