తెలంగాణ (TG) అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.. నదీ జలాల పంపిణీ, పాలమూరు ప్రాజెక్ట్లపై చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే హాట్టాపిక్గా మారాయి.. రేపటి (డిసెంబరు 29) నుంచి జరగనున్న ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నట్లు పార్టీ నేతలతో కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Also: KCR: అసెంబ్లీ వేళ కేసీఆర్ ఎంట్రీపై రాజకీయ చర్చలు
పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హైదరాబాద్లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ (KCR) పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వస్తుందో గమనించి, దానికి అనుగుణంగా దీటుగా స్పందించాలని సూచించారు.

ముఖ్యంగా (TG) పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ లోపల, బయట బలమైన పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, అసెంబ్లీ సమావేశాల కోసం కేసీఆర్ హైదరాబాద్కు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: