Telugu News: KCR-అస్వస్థతకు గురైన కేసీఆర్ – ఎర్రవల్లిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

Read Time:  1 min
Telugu News: KCR-అస్వస్థతకు గురైన కేసీఆర్ – ఎర్రవల్లిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స
FONT SIZE
GET APP

KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. సమాచారం అందుకున్న వెంటనే హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం అక్కడికి చేరుకుని చికిత్స ప్రారంభించింది. వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో కేసీఆర్ రక్తంలో చక్కెర (షుగర్), సోడియం స్థాయిల్లో మార్పులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, ఆయన ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.

KCR-అస్వస్థతకు గురైన కేసీఆర్ – ఎర్రవల్లిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స
KCR-అస్వస్థతకు గురైన కేసీఆర్ – ఎర్రవల్లిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స

కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎర్రవల్లిలో కేటీఆర్

తండ్రి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తన కుమారుడు హిమాన్షుతో కలిసి స్వయంగా కారు నడుపుకుంటూ ఎర్రవల్లికి చేరుకున్నారు. అలాగే మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫాంహౌస్‌కి వెళ్లి వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఫాంహౌస్‌లోనే చికిత్స పొందుతుండగా, వైద్యుల బృందం నిరంతరం గమనిస్తోంది. పరిస్థితి మెరుగుపడకపోతే, త్వరలోనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా అక్కడే ఉండి చికిత్స పర్యవేక్షణలో పాల్గొంటున్నట్లు సమాచారం.

ప్రస్తుతం కేసీఆర్ ఎక్కడ చికిత్స పొందుతున్నారు?
ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

కేసీఆర్‌కు ఏ సమస్యలు తలెత్తాయి?
రక్తంలో షుగర్ మరియు సోడియం స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/dharmasthala-case-sujatha-bhatt-bhima/crime/535016/

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.