ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ (Telangana) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు చివరి అవకాశాన్ని ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై మూడు వారాల్లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం ప్రకటించకపోతే, అది కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.
Read Also: TS: అనుబంధ గుర్తింపు కోసం 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ

తుది అవకాశంగా మూడు వారాల గడువు
అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని గత విచారణలో వ్యాఖ్యానించిన కోర్టు, ఈసారి మరింత కఠినంగా వ్యవహరించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే విచారణ జరుపుతున్నారని కోర్టుకు తెలిపారు.
ఒక ఎమ్మెల్యే పిటిషన్పై విచారణ పూర్తయిందని, మరో ఇద్దరిపై ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం కావాలని ఆయన కోరారు.ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తుది అవకాశంగా మూడు వారాల గడువు మంజూరు చేసింది. ఈ గడువు తర్వాత తదుపరి విచారణ జరుపుతామని పేర్కొంటూ, కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: