ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికం అవుతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో ప్రమాదాలు పెరిగి, కుటుంబాలకు వేదనను మిగుల్చుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ(Telangana Crime)వాస్తులు మరణించారు.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ నుండి మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలజ్ కర్ర వినాయకుడి(Palaj Karra Ganesha) దర్శనానికి వెళ్లిన భక్తుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామం నుంచి 15 మంది భక్తులు మూడు కార్లలో నిన్న ఉదయం బయలుదేరారు. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభించారు. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా నందా గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు, రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలైన చేకూరి బుల్లిరాజు (53), సునీత (48), బుల్లిరాజు బావమరిది అర్ధాంగి వాణి (45) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వాహనం నడుపుతున్న గుణం శేఖర్ కు తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ లోని ఒక ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికురాలు నీలిమ కూడా గాయపడ్డారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోకర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దైవదర్శనం చేసుకుని, క్షేమంగా తమవారు తిరిగి వస్తారని భావించిన కుటుంబ సభ్యులకు తీరని ఆవేదనే మిగిలింది. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటారని ఎదురుచూస్తున్న కుటుంబీకులకు ఊహించని ప్రమాదంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Hindi news: Hindi.vaartha.com
Read Also: